Poco నుంచి మొట్ట మొదటి టాబ్లెట్, లాంచ్ ఎప్పుడంటే! వివరాలు
Poco సంస్థ మే 23న భారతదేశంలో లాంచ్ ఈవెంట్ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో కంపెనీ Poco F6 ని భారతదేశంలో విడుదల చేయనుట్లు తెలుస్తోంది. ఇంకా,Poco F6 తో పాటు Poco F6 ప్రో కూడా లాంచ్ కావచ్చని పుకార్లు ఉన్నాయి.
వీటన్నింటికంటే, మేము ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పరికరం పోకో ప్యాడ్. Poco తన మొట్టమొదటి టాబ్లెట్ను భారతదేశంలో ప్రారంభించవచ్చని మరియు అది కూడా మే 23 న ఈవెంట్లో ప్రారంభించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.

ఇప్పుడు, పోకో ప్యాడ్ గురించి మనకు తెలిసిన వివరాలు అంచనాలుగా మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు అధికారికంగా పరిగణించకూడదు. గత నెలలో చైనాలో లాంచ్ అయిన Redmi Pad Pro ని Poco టాబ్లెట్గా రీబ్రాండ్ చేయవచ్చని సూచించే అనేక నివేదికలు ఉన్నాయి. అంటే, రెడ్మి ప్యాడ్ ప్రో అనేది రెడ్మి బ్రాండ్ క్రింద షియోమీ యొక్క మూడవ టాబ్లెట్ అవుతుంది. మరియు ఈ పుకార్లు నిజమైతే, ఇది Poco యొక్క మొట్టమొదటి టాబ్లెట్ అవుతుంది.
పోకో టాబ్లెట్ రెడ్మి ప్యాడ్ ప్రో యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని వచ్చిన పుకార్లు నిజమైతే, ఇది ఎలాంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందనే విషయాన్నీ మనం గమనించవచ్చు. రెడ్మి ప్యాడ్ ప్రో 12.1-అంగుళాల IPS LCD తో 2560 x 1600 పిక్సెల్ల రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 16:10 యాస్పెక్ట్ రేషియో మరియు 600 nits గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.
రెడ్మి ప్యాడ్ ప్రో యొక్క ఫీచర్లలో డాల్బీ అట్మోస్ మరియు 3.5 mm హెడ్ఫోన్ జాక్తో కూడిన క్వాడ్-స్పీకర్ సెటప్ కూడా ఉన్నాయి.
ఈ Poco టాబ్లెట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 చిప్సెట్తో అందించబడుతుందని అంచనా వేయబడింది. 6GB లేదా 8GB RAM ఆప్షన్లు మరియు 128GB లేదా 256GB స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి.
ఇక కెమెరా కాన్ఫిగరేషన్ రెడ్మి ప్యాడ్ ప్రోతో సమానంగా ఉండవచ్చు, వెనుకవైపు 8-మెగాపిక్సెల్ వైడ్ కెమెరా మరియు సెల్ఫీలు మరియు వీడియో కాల్ల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది.
ఈ Poco టాబ్లెట్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత HyperOS పై పనిచేస్తుందని అంచనా వేయబడింది. ఇది HyperOS పరికరాల కోసం కొనసాగింపు ఫీచర్లకు మద్దతునిస్తుంది. రెడ్మి ప్యాడ్ ప్రో మాదిరిగానే 33W ఫాస్ట్ ఛార్జింగ్తో కూడిన బలమైన 10,000 mAh బ్యాటరీ ఈ Poco టాబ్లెట్కు శక్తినిచ్చే అవకాశం ఉంది.
గిజ్బాట్ తెలుగు వెబ్సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








