Home
News

Jio - Qualcomm న్యూ డీల్!!! ఇండియాలో 5G సర్వీసుకు లైన్ క్లియర్...

ఇండియా యొక్క అతి పెద్ద సంస్థలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫాంలో రోజు రోజుకి పెట్టుబడులు అధికం అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇందులోకి క్వాల్కమ్ సంస్థ కూడా చేరింది.

Jio - Qualcomm డీల్

Jio - Qualcomm డీల్

ప్రముఖ క్వాల్కమ్ ఇన్కార్పొరేటెడ్ వెంచర్ ఆర్మ్ జియో ప్లాట్‌ఫాం యొక్క 0.15 శాతం వాటాను 730 కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకరించింది. ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌తో తొలి ఒప్పందాన్ని ప్రకటించినప్పటి నుంచి జియోలో ఇతర కంపెనీల పెట్టుబడులు పెరిగాయి. ఇది 13 వ ఒప్పందం కావడం మరొక గొప్ప విషయం. ఇప్పటికి జియో సంస్థ యొక్క 25.24 శాతం వాటాను అమ్మడం ద్వారా RIL మొత్తంగా రూ.1,18,318.45 కోట్లను పొందగలిగింది. జియో ప్లాట్‌ఫామ్‌లలో తక్కువ పెట్టుబడిని పెట్టిన వాటాదారులలో ఇంటెల్ క్యాపిటల్‌ సరసన క్వాల్‌కామ్ వెంచర్స్ కూడా చేరింది.

 

జియో 5G సర్వీస్

జియో 5G సర్వీస్

రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క జియో ప్లాట్‌ఫామ్‌లో క్వాల్కమ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ 0.15 శాతం వాటాను రూ.730 కోట్లతో కొనుగోలు చేయడంతో జియో తన ప్లాట్‌ఫామ్స్‌లోని భారతీయ వినియోగదారుల కోసం అధునాతన 5G సేవలను రూపొందించడానికి సహాయపడుతుందని రిలయన్స్ సంస్థ తెలిపింది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు 5G ఎయిర్‌వేవ్స్‌ను వేలం వేయడానికి భారత్ సిద్ధమవుతున్న సమయంలో క్వాల్కమ్ సంస్థతో భాగస్వామ్యం పొందడం జియోకు కలిసి రానున్నది.

 

జియో- క్వాల్కమ్ పెట్టుబాటుల వ్యూహం

జియో- క్వాల్కమ్ పెట్టుబాటుల వ్యూహం

ఇండియాలో టెలికామ్ రంగంలోకి జియో ప్రవేశించిన తరువాత డిజిటల్‌ పరంగా బాగా అభివృద్ధి చెందింది. ఇండియాను డిజిటల్‌గా మరింత మెరుగ్గా మార్చే క్రమంలో కెకెఆర్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, ముబడాలా మరియు పిఐఎఫ్ వంటి వారి యొక్క పెట్టుబడిదారులతో బాగస్వామం కుదుర్చుకున్నది. ఇంటెల్ క్యాపిటల్ చేరికతో డిజిటల్ ఆర్మ్ వ్యూహాత్మక పెట్టుబడిదారులలో మరింత ముందు అడుగుతో వస్తోంది. 5G శక్తిగా ఉన్న క్వాల్కమ్ చేరికతో ఇప్పుడు మరొక అడుగు ముందుకు వచ్చింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఉండటానికి ఈ పెట్టుబడి మరొక వ్యూహాత్మక నాటకం.

జియో మొత్తం పెట్టుబడులు

జియో మొత్తం పెట్టుబడులు

ఈ కొత్త ఒప్పందంతో జియో కంపెనీ యొక్క ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు మరియు ఎంటర్ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లకు చేరింది. ఈ పెట్టుబడితో క్వాల్‌కామ్ మరియు జియో ప్లాట్‌ఫారమ్‌ల మధ్య సంబంధాలను మరింత పెరగవచ్చు. జియో ప్లాట్‌ఫామ్‌లకు భారతీయ వినియోగదారుల కోసం అధునాతన 5G మౌలిక సదుపాయాలు మరియు సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయాణంలో మద్దతు ఇస్తుంది అని క్వాల్కమ్ ఒక ప్రకటనలో తెలిపింది. PIF ఒప్పందం తరువాత జియో ప్లాట్‌ఫాంలు కంపెనీలో అదనపు వాటాను విక్రయించవు అనిపించింది.

ఇండియాలో 5G సర్వీస్

ఇండియాలో 5G సర్వీస్

వ్యూహాత్మక భాగస్వాములకు చిన్న ఈక్విటీని ఇస్తున్న జియో- క్వాల్కమ్ ఒప్పందం కారణంతో మరిన్ని ఒప్పందాలలో ఈక్విటీ వాటా RIL ఏ శాతం అమ్మాలని యోచిస్తోంది అనేది స్పష్టంగా తెలియదు. జియో ప్లాట్‌ఫామ్‌ల పూర్తి యాజమాన్యంలోని రిలయన్స్ జియోలో 388 మిలియన్ 4G చందాదారులు ఉన్నారు. ప్రభుత్వం వేలం ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత భారతదేశంలో మొదట 5G సర్వీసుని అందించడానికి కూడా ఇది సిద్ధంగా ఉంది. ఇది గ్రీన్‌ఫీల్డ్ 4G నెట్‌వర్క్ సాఫ్ట్‌వేర్ సహాయంతో 5G కి మారే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం.

క్వాల్కమ్ 5G సర్వీస్

క్వాల్కమ్ 5G సర్వీస్

భారతదేశంలో వాణిజ్య 5G సేవలను 2022లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికే చాలా 5G స్మార్ట్‌ఫోన్‌ల కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 5G చిప్‌సెట్లను ఉపయోగిస్తాయి. ప్రముఖ క్వాల్కమ్ సంస్థ 5Gపై లోతైన మరియు బలమైన అవగాహన కలిగిన కంపెనీగా ప్రస్తుతం ఉంది. ఈ కొత్త భాగస్వామ్యంతో జియోకు 5G మౌలిక సదుపాయాలను నిర్మించటానికి అనుమతించగలదు. క్వాల్కమ్ యొక్క 5G మోడెమ్ అధిక ప్రయోజనాన్ని పొందుతుంది. ప్రస్తుతానికి RIL యొక్క టెక్నాలజీ ఆర్మ్ అధిక-పెట్టుబడిదారులను జోడిస్తూనే ఉంది.

Best Mobiles in India

English summary
Qualcomm Invest Rs.730 Crores in Reliance Jio Platforms
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X