UPI వాడేవారికి RBI కొత్త ప్లాన్, అమలైతే ఇక క్రెడిట్ కార్డుల అవసరమే ఉండదు!
UPI లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్ బ్యాంక్ లైన్ల ద్వారా UPI వినియోగదారులకు క్రెడిట్ను అందించడం ద్వారా జనాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పరిధిని విస్తరించాలని ప్రతిపాదిస్తోంది.
"ఈ ప్రతిపాదన ఆవిష్కరణలను మరింత ప్రోత్సహిస్తుంది" అని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రతిపాదన ప్రకారం బ్యాంకులు అంగీకరిస్తే క్రెడిట్ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఇది మారగలదు.

UPI అనేది తక్షణ నిజ సమయ చెల్లింపుల వ్యవస్థ, ఇది బ్యాంక్ ఖాతా వివరాలను బహిర్గతం చేయకుండా అనేక బ్యాంకుల ద్వారా డబ్బును బదిలీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దీని ప్రజాదరణ కారణంగా రోజువారీ లావాదేవీల కోసం నగదు మరియు డెబిట్ కార్డుల వినియోగాన్ని తగ్గించింది.
ప్రస్తుతం, మార్చి 2023లో, UPI, 8.65 బిలియన్ల లావాదేవీలను నెలకొల్పింది. దీని విలువ ఇది 14.05 ట్రిలియన్ రూపాయలు. ఇది లాంచ్ అయినప్పటి నుండి అత్యధికంగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి డేటాను చూడవచ్చు.
దేశం లో డిజిటల్ చెల్లింపులను పెంచే ప్రయత్నంలో, RBI ఇటీవల రూపే క్రెడిట్ కార్డ్లను UPIకి లింక్ చేయడానికి అనుమతించింది. దీని ద్వారా కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్లను లింక్ చేయడానికి మరియు UPI ద్వారా చెల్లించడానికి వీలు కల్పించడం కోసం ఇది సాధ్యమౌతుంది.
ప్రస్తుతం RBI ప్రతిపాదిస్తున్న ఈ పద్దతి ద్వారా కస్టమర్లకు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ను అందించడానికి బ్యాంకులను అనుమతించడం ద్వారా, UPI ఖాతాలు ఇప్పుడు క్రెడిట్ కార్డ్లకు ప్రత్యామ్నాయాన్ని అందించగలవని స్వతంత్ర విధాన పరిశోధకుడు శ్రీనాథ్ శ్రీధరన్ తెలిపారు. "ఇది క్రెడిట్ కార్డులను బ్యాంకులు చూసే విధానాన్ని మార్చగలదు."
గత నెలలో, బిల్ గేట్స్ తన భారత పర్యటనలో UPI డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు విశ్వసనీయత మరియు తక్కువ ధర కలిగిన 5G కనెక్టివిటీ లో భారత దేశం ఎంతో ప్రగతిని సాధిస్తోందని ఆయన ప్రశంసించారు.
ఫిబ్రవరిలో, భారతదేశం యొక్క UPI సిస్టంని సింగపూర్ యొక్క పే నౌ (PayNow) డిజిటల్ చెల్లింపుల వ్యవస్థతో లింక్ చేసింది. దీని ద్వారా రెండు దేశాలకు చెందిన వినియోగదారులు లావాదేవీలు సులభంగా జరపవచ్చు. ఈ రెండు చెల్లింపు వ్యవస్థల అనుసంధానం రెండు దేశాల ప్రజల మధ్య సరిహద్దు చెల్లింపులను వేగంగా మరియు మరింత తక్కువ ఖర్చుతో బదిలీకి అనుమతిస్తుంది.
సింగపూర్ తో పాటుగా ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, USA, సౌదీ అరేబియా, UAE మరియు యునైటెడ్ కింగ్డమ్ వంటి ఈ 10 దేశాల్లోని నాన్-రెసిడెంట్లకు కూడా ఈ UPI సేవలను ప్రకటించారు.NRIలు మరియు PIOలు నాన్-రెసిడెంట్ (ఎక్స్టర్నల్) రూపాయి (NRE) బ్యాంక్ ఖాతాలను తెరవగలరు, రూపాయిలో బోనాఫైడ్ లావాదేవీల కోసం విదేశాలలో నివసిస్తున్న ఎవరైనా నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (NRO) ఖాతాలను తెరవవచ్చు.


Click it and Unblock the Notifications