PhonePe ద్వారా మొబైల్ రీఛార్జ్ చేస్తున్నారా?? అయితే జాగ్రత్త...
ఇండియాలో అన్ని రకాల టెలికాం సంస్థల యొక్క ప్రీపెయిడ్/పోస్ట్పెయిడ్ ప్లాన్లను రీఛార్జ్ చేయడానికి యూజర్లు వారి సౌలభ్యం ప్రకారం అనుమతించే టన్నుల థర్డ్ పార్టీ అప్లికేషన్లు మరియు ఆన్లైన్ వాలెట్లు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అప్లికేషన్లలో ఒకటి ఫోన్పే. ఇకపై ఫోన్పే అప్లికేషన్ని ఉపయోగించి తమ సిమ్లను రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు అధిక మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫోన్పే వారు తమ అప్లికేషన్ ద్వారా చేసే ప్రతి లావాదేవీపై కస్టమర్ల నుండి చిన్న ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటారు. అందువల్ల మొబైల్ రీఛార్జ్ల కోసం వినియోగదారులు కొంత అదనపు మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇండియాలో UPI ఆధారిత థర్డ్ పార్టీ అప్లికేషన్లు అభివృద్ధి చెందిన తరువాత తమ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయడంలో ఫోన్పే మొదటిది కాదు. ఫోన్పే కూడా ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ మీద రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. అయితే ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నదో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

PhonePe లో మొబైల్ రీఛార్జ్లపై అదనపు మొత్తం
PTI నుంచి వచ్చిన నివేదికల ప్రకారం PhonePe ద్వారా ప్రీపెయిడ్/పోస్ట్పెయిడ్ ప్లాన్లను రీఛార్జ్ చేసే వినియోగదారులకు వారి రీఛార్జ్ మొత్తం లేదా ప్లాన్ రూ.50 లోపు ఉంటే ఎలాంటి ఛార్జీ విధించబడదు. అయితే రూ.50 మరియు రూ.100 మధ్య గల ప్లాన్లతో రీఛార్జ్ చేస్తున్న వ్యక్తుల వద్ద నుంచి రూ.1 అదనంగా వసూలు చేస్తారు. ఇంకా రూ.100 కంటే ఎక్కువ మొత్తం రీఛార్జ్ ప్లాన్లతో వెళ్తున్న కస్టమర్లు ఫోన్పేకి ప్రాసెసింగ్ ఫీజుగా రూ.2 అదనంగా చెల్లించాలి.

PhonePe క్రెడిట్ కార్డ్ల ద్వారా చేసే లావాదేవీలకు కూడా ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయడం ప్రారంభిస్తుంది. PhonePe చాలా మంది వినియోగదారుల యొక్క మొదటి ఎంపిక అయితే మీరు అదనపు ప్రాసెసింగ్ రుసుము చెల్లించకూడదనుకుంటే మీరు ఇతర అప్లికేషన్లను ఉపయోగించుకోవచ్చు. మీ ఫోన్ నంబర్ను నేరుగా రీఛార్జ్ చేయడంలో మీకు సహాయం చేయడానికి Google Pay, Paytm వంటి మరిన్ని యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మీరు మొబైల్ రీఛార్జ్ల కోసం మీ మొబైల్ ఆపరేటర్ యొక్క అంకితమైన అప్లికేషన్ను నేరుగా ఉపయోగించవచ్చు మరియు నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా చెల్లించవచ్చు.

ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన పరిణామం. నిర్దిష్ట పరిమితికి మించి లావాదేవీలు జరిపేందుకు కొన్ని అదనపు రూపాయిలు వసూలు చేయడానికి ఫోన్పే మాదిరిగానే ఇతర కంపెనీలు మరియు అప్లికేషన్లు అదే మార్గంలో వెళ్లడాన్ని మనం చూడవచ్చు. వినియోగదారులు ఇప్పుడు చేయవలసిన ఉత్తమమైన పని మొబైల్ ఆపరేటర్ యొక్క అంకితమైన ఫోన్ అప్లికేషన్ను ఉపయోగించడం.

ఫోన్పే క్యాష్బ్యాక్ ఆఫర్
ఫోన్పే యొక్క క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రస్తుతం అన్ని పేమెంట్ ఇన్స్ట్రుమెంట్లలో యాప్ యొక్క తాజా వెర్షన్లోని ఫోన్పే వినియోగదారులందరికీ వర్తిస్తుంది అని ఇది తెలిపింది. ఈ ఆఫర్ పొందడానికి వినియోగదారులు ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. తరువాత మొబైల్ రీఛార్జ్లపై క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నంబర్ను ఎంచుకోవాలి మరియు వారు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా రీఛార్జ్ చేయాలి. ఫోన్పేకి 325 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. వినియోగదారులు డబ్బు పంపవచ్చు మరియు స్వీకరించవచ్చు. వీటితో పాటుగా మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జ్ చేయవచ్చు, స్టోర్లలో చెల్లించవచ్చు, యుటిలిటీ చెల్లింపులు చేయవచ్చు, బంగారం కొనుగోలు చేయవచ్చు మరియు ఈ ప్లాట్ఫారమ్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. PhonePe 2017లో గోల్డ్ లాంచ్తో ఫైనాన్షియల్ సర్వీసెస్లోకి ప్రవేశించింది. దాని ప్లాట్ఫారమ్లో 24-క్యారెట్ బంగారాన్ని సురక్షితంగా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు సురక్షితమైన మరియు అనుకూలమైన ఎంపికను అందిస్తుంది. ఈ ప్లాట్ఫామ్ భారతదేశవ్యాప్తంగా 22 మిలియన్లకు పైగా మర్చంట్ ఔట్లెట్లలో కూడా ఆమోదించబడింది.


Click it and Unblock the Notifications








