రిలయన్స్ కాల్ ఛార్జీలు పెంపు!

|

ఇండియాలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ మొబైల్ కాల్ రేట్‌లను 30శాతానికి పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా ధర పెంపు జీఎస్ఎమ్ ఇంకా సీడీఎమ్ఏ ప్రీ-పెయిట్ కస్టమర్‌లకు వర్తిస్తుంది. స్పెక్ట్రమ్ ఛార్జీలు పెంపుతో దేశంలోని మొబైల్ ఆపరేటర్లు ఇటీవల కాలంలో కాల్ రేట్‌లను పెంచుతున్న విషయం తెలిసిందే. రిలయన్స్ తాజా చర్యతో మారిన టారిఫ్ ప్లాన్‌ల వివరాలను క్రింద చూడొచ్చు...

రిలయన్స్ కాల్ ఛార్జీలు పెంపు!

ప్లాన్ 21: ఈ ప్లాన్‌లో భాగంగా సెకనుకు 1 పైసాను వసూలు చేసేవారు. తాజా సవరణలో భాగంగా సెకనుకు 1.2పైసలను ఛార్జ్ చేస్తారు.

ప్లాన్ 45: ఈ ప్లాన్‌లో భాగంగా సెకనుకు 1 పైసాను వసూలు చేసేవారు. తాజా సవరణలో భాగంగా సెకనుకు 1.2పైసలను ఛార్జ్ చేస్తారు.

ప్లాన్ 46: ఈ ప్లాన్‌లో భాగంగా 200 లోకల్ ఆన్-నెట్ నిమిషాలను ఆఫర్ చేసేవారు. తాజా సవరణలో భాగంగా 200 లోకల్ నిమిషాలను 140 నిమిషాలకు కుదించారు.

ప్లాన్ 48: ఈ ప్లాన్‌‌లో భాగంగా 500 (ఆర్కామ్ నుంచి ఆర్కామ్) నిమిషాలను పొందవచ్చు. తాజా సవరణలో భాగంగా 500 నిమిషాలను 160 నిమిషాలను కుదించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X