Jio లో 5G ని ఎలా వాడాలి ? ఆహ్వానం ఎలా పొందాలి, ఏ ప్లాన్ తో రీఛార్జ్ చేయాలి ?

By Maheswara
|

రిలయన్స్ జియో, భారతదేశపు నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ గా, గరిష్టంగా 1 Gbps డౌన్‌లోడ్ వేగంతో వినియోగదారులకు ఉచిత 5G ఇంటర్నెట్ ను అందిస్తోంది. ఇది సంతోషకరమైన వార్త, కానీ ప్రతి జియో వినియోగదారుడు ప్రస్తుతం రిలయన్స్ జియో యొక్క 5G నెట్‌వర్క్ సేవలకు యాక్సెస్ పొందలేరు. ప్రస్తుతం, మీరు Jio యొక్క 5G నెట్‌వర్క్ సేవలను యాక్సెస్ చేయాలనుకుంటే తప్పనిసరిగా కంపెనీ నుండి మీరు ఆహ్వానాన్ని పొందాలి.

 Jio యొక్క 5G

ఇంకా, మీరు Jio యొక్క 5G నెట్‌వర్క్‌కు ఏ ఆఫర్‌ను యాక్సెస్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే వాటికి కొన్ని  అర్హత గల ప్లాన్‌లు ఉన్నాయి అవి ఏంటో మీకు ఇక్కడ తెలియచేస్తాము. మీరు అర్హత గల ప్లాన్‌తో రీఛార్జ్ చేయనట్లయితే, మీరు Reliance Jio యొక్క 5G సేవలను ఉపయోగించగలరు. ఏది ఏమైనా, దీని గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలను ఇక్కడ ఇస్తున్నాము గమనించండి.

5G నెట్వర్క్ కోసం Jio వెల్‌కమ్ ఆఫర్:

5G నెట్వర్క్ కోసం Jio వెల్‌కమ్ ఆఫర్:

మీరు ఏమి చేస్తే 5G ఆహ్వానాన్ని పొందవచ్చు అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్‌లో MyJio యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఇది iOS మరియు Android వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆపై, మీరు అర్హత ఉన్న నగరాల్లో ఉన్నట్లయితే, మీరు MyJio యాప్‌లో సైన్-ఇన్ చేసినప్పుడు స్క్రీన్ పైన Jio యొక్క 5G ఆఫర్‌ను చూస్తారు. Jio దాని 5G నెట్‌వర్క్ యొక్క బీటా ట్రయల్‌లో మీరు భాగం కావాలనుకుంటున్నారని తెలియజేయడానికి మీకు ఆసక్తి ఉందని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సిందల్లా Jio మీకు కన్ఫర్మేషన్ పంపే వరకు వేచి ఉండండి.

Jio 5G అర్హత గల రీఛార్జ్ ప్లాన్‌లు

Jio 5G అర్హత గల రీఛార్జ్ ప్లాన్‌లు

Jio యొక్క 5G నెట్వర్క్ ని ఉపయోగించడానికి అర్హత పొందడానికి మీరు Jio నుండి రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. Reliance Jio రూ. 239 కంటే తక్కువ ధర గల ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 5G ఆఫర్‌ను అందించడం లేదు. కాబట్టి ప్రాథమికంగా, ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌ల కోసం, రూ. 239 కంటే ఎక్కువ ప్లాన్ ఉన్న ఏదైనా ప్లాన్ మిమ్మల్ని 5G ఆఫర్‌కు అర్హులుగా చేస్తుంది. ప్రీపెయిడ్ కస్టమర్‌ల కోసం డేటా యాడ్-ఆన్ వోచర్‌లపై ఇది వర్తించదని గుర్తుంచుకోండి. మీరు చాలా మటుకు అపరిమిత ప్రయోజనాల ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. మీరు ఇవన్నీ పూర్తి చేసినట్లయితే, మీరు Jio యొక్క 5G SA నెట్‌వర్క్‌కు మద్దతు ఇచ్చే 5G స్మార్ట్‌ఫోన్‌ని కలిగి ఉండాలి.

జియో తమ కొత్త లాప్టాప్

జియో తమ కొత్త లాప్టాప్

ఇది ఇలా ఉండగా జియో తమ కొత్త లాప్టాప్ ను కూడా లాంచ్ చేసింది.ఈ Jiobook ల్యాప్‌టాప్ లు తొలుత మొదట ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ ద్వారా ప్రత్యేకంగా రీ సెల్లర్లకు విక్రయించడం జరిగింది. కాగా, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇది బడ్జెట్ ల్యాప్‌టాప్. ఇది 11.6-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 SoC ప్రాసెసర్ మరియు 5000mAh బ్యాటరీ కలిగి ఉన్నట్లు కంపెనీ వివరాలను వెల్లడించింది. గ్లోబల్ దిగ్గజాలు Qualcomm మరియు Microsoft భాగస్వామ్యంతో రిలయన్స్ ఈ ల్యాప్ టాప్ ను అభివృద్ధి చేసింది.

Jiobook ధర

Jiobook ధర

భారత మార్కెట్లో రిలయన్స్ Jiobook ధర రూ.15,799 గా కంపెనీ నిర్ణయించింది. మరియు రిలయన్స్ డిజిటల్ యొక్క ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా భారతీయ వినియోగదారులకు ఈ జియో బుక్ అందుబాటులో ఉంటుంది. రీసెల్లర్స్ కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న GeM జాబితా బడ్జెట్ ల్యాప్‌టాప్ ధరను రూ.19,500 గా నిర్ణయించింది. అదనంగా, ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు Axis, Kotak, ICICI, HDFC, AU, INDUSIND, DBS, ఇతర ప్రధాన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio 5G Offer, How To Get Invite For 5G Network Check Here. Eligible Recharge Plans.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X