భారతదేశంలో 5G ట్రయల్స్ మరింత ఆలస్యం కానున్నాయి!! కారణం ఏమిటో
ఇండియాలోని టెలికమ్యూనికేషన్ కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో మరియు వోడాఫోన్ ఐడియా 5G ట్రయల్స్ కోసం ఒక సంవత్సరం పొడిగింపును అందించాలని టెలికాం శాఖ (DoT)ని అభ్యర్థించాయి. టెలికాం కంపెనీలకు ఇచ్చిన పర్మిట్ నవంబర్ 26తో ముగియడంతో ఈ అభ్యర్థన వెలుగులోకి వచ్చింది. టెలికాం శాఖ ఈ పొడిగింపుకు అంగీకరిస్తే కనుక 5G వేలం 2022 ద్వితీయార్థంలో జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మేలో ప్రభుత్వం టెలికాం కంపెనీలకు 700 MHz బ్యాండ్, 3.3-3.6 GHz (GHz) బ్యాండ్ మరియు 24.25-28.5 GHz బ్యాండ్లను ఆరు నెలల పాటు వివిధ ప్రదేశాలలో పరీక్షించడానికి స్పెక్ట్రమ్ను కేటాయించింది.

స్పెక్ట్రమ్ వేలం కోసం ధర మరియు పద్దతిపై అభిప్రాయాన్ని కోరుతూ టెలికాం శాఖ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)తో 5G యొక్క వాణిజ్య ప్రారంభాన్ని ప్రారంభించింది. నివేదిక ప్రకారం "మూడు టెల్కోలు తమ ట్రయల్స్ను మరో ఏడాది పొడిగించాలనుకుంటున్నాయి" అని ఒక టెలికాం ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ మీడియాకు నివేదించారు. అయితే 5G సర్వీస్ అందరికీ వెంటనే అందుబాటులో ఉండకపోవచ్చు. సెల్యులార్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో పూర్తిగా అభివృద్ధి చెందడానికి కనీసం ఏడాదిన్నర సమయం పట్టవచ్చు.

భారతదేశంలో 5G నెట్వర్క్ ధర
DoT ఏర్పాటు చేసిన 3.3-3.6 GHz బ్యాండ్లో 5G స్పెక్ట్రమ్కు నిర్ణయించిన కనీస ధర రూ.50,000 కోట్లు. ఇది టెల్కో కంపెనీల ప్రకారం కొనుగోలు చేయడానికి చాలా ఎక్కువ కావున ప్రభుత్వం తన కొత్త సిఫార్సులలో ధరను తగ్గించవచ్చని వారు ఆశిస్తున్నారు.

5G ట్రయిల్
ఇటీవల భారతీ ఎయిర్టెల్ మరియు ఎరిక్సన్ కంపెనీలు రెండు కలిసి గ్రామీణ ప్రాంతంలో 5G నెట్వర్క్ ట్రయిల్ ను నిర్వహించాయి. టెలికాం డిపార్ట్మెంట్ ఎయిర్టెల్కి కేటాయించిన 5G ట్రయల్ స్పెక్ట్రమ్ని ఉపయోగించి ఢిల్లీ/NCR శివార్లలోని భైపూర్ బ్రామనన్ గ్రామంలో ఈ ట్రయిల్ ను నిర్వహించారు. సెప్టెంబర్లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్-టాటా మిళితం వారి పరికరాల ఆధారంగా 5G ట్రయల్లను ప్రారంభించింది. స్వదేశీ 5G ట్రయల్ నవీ ముంబైలో జరిగింది. రియల్ టైమ్ స్ట్రీమింగ్ కోసం నెట్వర్క్-స్లైసింగ్ సామర్థ్యాన్ని ధృవీకరించడానికి టెల్కో దాని స్వంత 5G RAN మరియు 5G స్వతంత్ర కాంబో కోర్ను ఉపయోగించింది.

ఇటీవల ఎయిర్టెల్ 4G హార్డ్వేర్తో నాన్-స్టాండ్-అలోన్ నెట్వర్క్లో తక్కువ బ్యాండ్ 5G నెట్వర్క్ యొక్క లైవ్ డెమోను ఇచ్చింది. ఇది కాకుండా mmWave 5G బ్యాండ్పై ఇంకా ఎయిర్టెల్ నుండి ఎటువంటి వార్తలు లేవు. ఎయిర్టెల్ మరియు ఎరిక్సన్ 5Gని విడుదల చేయడానికి కలిసి పనిచేస్తున్నాయి. అయితే జియో భారతదేశంలో Qualcomm కంపెనీ సహకారంతో 5G నెట్వర్క్ను విడుదల చేస్తుంది.

5G రోల్అవుట్లో ఆలస్యం కారణంగా భారతీయ ఆపరేటర్లు ప్రయోజనం పొందవచ్చు. కానీ 5G సేవలను ప్రారంభించడంలో దేశం చాలా ఇతర దేశాల కంటే చాలా వెనుకబడి ఉంది. అయితే నివేదికల ప్రకారం ఈ ఆలస్యం భారతీయ టెలికాం ఆపరేటర్లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే వారు తక్కువ ధరకు నెట్వర్క్ పరికరాలను పొందవచ్చు. భారతదేశంలో 5G పరికరాల స్వీకరణను పెంచడానికి స్మార్ట్ఫోన్ కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి.


Click it and Unblock the Notifications








