Just In
- 10 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 16 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 18 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 20 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జియో మరో సంచలనం, రెండున్నరేళ్లలోనే..
కస్టమర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో ఇతర టెలికాం దిగ్గజాలకు అందనంత వేగంలో దూసుకుపోతున్నది. టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేండ్లలో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న సంస్థగా జియో అవతరించింది.
కస్టమర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో ఇతర టెలికాం దిగ్గజాలకు అందనంత వేగంలో దూసుకుపోతున్నది. టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేండ్లలో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న సంస్థగా జియో అవతరించింది. మార్చి 2న ఈ మైలురాయిని సాధించిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా మరింత సమాచారం ఇవ్వడానికి వారు నిరాకరించారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా జియో..30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్నట్లు జియో చెబుతోంది. ఐపీఎల్ సీజన్ సందర్భంగా టీవీల్లో ఇచ్చే కమర్షియల్ యాడ్స్లో .. 'సెలబ్రేటింగ్ 300 మిలియన్ యూజర్స్’ అని పేర్కొనడంతో ఈ విషయం స్పష్టమైంది.
170 రోజుల్లోనే
10 కోట్ల మంది చందాదారులను వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించిన తర్వాత కేవలం 170 రోజుల్లోనే సొంతం చేసుకుని జియో గతంలోనే రికార్డు నమోదు చేసింది.
భారతీ ఎయిర్టెల్కు
మరోవైపు ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్టెల్కు జనవరి నాటికి 34 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. 30 కోట్ల కస్టమర్ల మైలు రాయిని చేరుకునేందుకు ఎయిర్టెల్కు 19 ఏళ్లు పట్టిన విషయం గమనార్హం.
వొడాఫోన్, ఐడియాలు
వొడాఫోన్ ఐడియా 40 కోట్ల మంది యూజర్లతో ప్రస్తుతం అతిపెద్ద టెలికం కంపెనీగా ఉండగా, ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. కాగా వొడాఫోన్, ఐడియాలు వీలినం కావడంతో 408 మిలియన్ల వినియోగదారులతో దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిన విషయం తెలిసిందే.
ఎయిర్టెల్ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని
ఇదిలా ఉంటే త్వరలో ఎయిర్టెల్ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని జియో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమర్షియల్ సేవలు ప్రారంభించిన 170 రోజుల్లోనే జియో 100 మిలియన్ల కస్టమర్లను అందుకొని ప్రపంచ తొలి టెలికాం సంస్థగా నిలిచింది.
జియో రాకముందు
జియో రాకముందు వరకూ ఇంటర్నెట్ ఛార్జీలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. జియో ఒకేసారి అన్లిమిటెడ్ కాలింగ్తోపాటూ 4జీ ఇంటర్నెట్ని ప్రజలు ఆశించినదానికంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడంతో జనాలు జియో కోసం ఎగబడ్డారు.
జియో సబ్స్క్రైబర్ల సంఖ్య
దాంతో ఇతర నెట్వర్క్ల నుంచీ కస్టమర్లు జియోకి మారారు. కొంతమంది రెండు, మూడు నెట్వర్క్లు కలిగివుంటూ... జియో సిమ్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా జియో సబ్స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470