జియో గుడ్ న్యూస్.. క్యాష్బ్యాక్ ఆఫర్ మరోసారి పొడగింపు!
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. గత కొద్ది రోజుల క్రితం తన కస్టమర్లకు ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆఫర్ కు గడువును మొదట నవంబర్ 25వ తేదీ వరకు నిర్ణయించింది.

కానీ వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనతో గడువు తేదీని మరికొద్ద రోజులు పొడిగించింది. రెండోసారి డిసెంబర్ 15వరకు గడువు పెట్టడంతో అదిముగిసిపోయింది. ఇప్పుడు జియో దాన్ని మళ్లీ పెంచింది. డిసెంబర్ 25వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించారు. ఈనెల 25వరకు జియో కస్టమర్లు ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొందవచ్చు.
అంతేకాదు, సంస్థ కస్టమర్లకు కొన్ని బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.
జియో ప్రైమ్ కస్టమర్లకు రిలయన్స్ జియో ఈ ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. 2,599ప్రతి రీఛార్జ్ రూ.399లేదా అంతకంటే ఎక్కువ వారికి 300రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 399ఆపైన విలువ గల ప్లాన్ను జియో యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా రీఛార్జి చేసుకుంటే వారికి 400రూపాయల విలువ గల 8 ఓచర్లు లభిస్తాయి. క్యాష్ బ్యాక్ ఓచర్లు, అమెజాన్ పే, యాక్సిస్ పే, ప్రీ ఛార్జ్, మోబిక్విక్, పేటీఎం, ఫోన్ పే రీచార్జ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ అఫర్ లభిస్తుంది.
ఏజియో, యాత్రా.కామ్, రిలయన్స్ ట్రెండ్.కామ్, వంటి ఇ-కామర్స్ భాగస్వాముల నుంచి ప్రత్యేకమైన ఓచర్ల ద్వారా షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఏజియో ఓచర్ ఉన్న వినియోగదారులకు 1500షాపింగ్ చేస్తే 399ఆఫర్ ప్రకటించింది. జియో ప్రైమ్ కస్టమర్లు యాత్రా రైల్వే టిక్కెట్లు కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. యాత్రా ద్వారా టిక్కెట్లు బుక్ చేయబడుతాయి. రిలయన్స్ ట్రెండ్. కామ్ లో షాపింగ్ జియో ప్రైమ్ కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది.
జియో క్యాఫ్ బ్యాక్ ఓచర్లు 400(రూ. 50 x8) మైజియోలో వెంటనే అందించబడుతాయి. 15 నవంబర్ 2017నుండి క్యాష్ బ్యాక్ ఆఫర్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇ-కామర్స్ ఓచర్లు 2017నవంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయి.


Click it and Unblock the Notifications








