రూ.1500 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలతో రిలయన్స్ జియో కస్టమర్లకు భారీ ఆఫర్...

|

భారతదేశపు నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో కస్టమర్లు మెరుగైన ఇంటర్నెట్ కనెక్టవిటి కోసం JioFi డివైస్ ని కొనుగోలు చేసినప్పుడు వారికి రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే నేటి రోజులలో భారీ డిమాండ్ ఉన్న ఉత్పత్తి కానప్పటికీ నెట్‌వర్క్‌ సమస్యలు ఉన్న ప్రాంతాలలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకే నెట్‌వర్క్‌తో అనేక పరికరాలను కనెక్ట్ చేయాలని చూస్తున్న వినియోగదారులందరికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. JioFi చాలా కాలంగా మార్కెట్లో ఉన్నప్పటికీ జియో నెమ్మదిగా ఈ ఉత్పత్తిని మార్కెటింగ్ చేయకుండా తన దృష్టిని మళ్లించింది. అందుకే మీరు దాని గురించి ఎక్కువగా వినలేరు. ఇది జియో యొక్క 4G నెట్‌వర్క్‌లో పనిచేసే Wi-Fi హాట్‌స్పాట్ డివైస్. ఈ డివైస్ లోపల ఒక SIM ఉండి డేటాను మెరుగ్గా యాక్సెస్‌ చేయడానికి వీలుకల్పిస్తుంది.

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో JioFi డివైస్

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో JioFi డివైస్

సాధారణంగా రూ.2,800 ధర వద్ద లభించే JioFi డివైస్ ని ప్రస్తుతం కొనుగోలు చేసే వినియోగదారులు వారి యొక్క కొనుగోలుపై జియో సంస్థ అందించే రూ.1,500 క్యాష్‌బ్యాక్ పొందడానికి అర్హులు అవుతారు. ఇది కొనుగోలు మొత్తంపై 50% కంటే ఎక్కువ క్యాష్‌బ్యాక్ కావడంతో ఇది చాలా మంచి డీల్ కావచ్చు. ఈ డివైస్ ని కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు సమీపంలోని జియో రిటైల్ స్టోర్‌లకు వెళ్లవచ్చని జియో తెలిపింది. మీ యొక్క లొకేషన్ లో సమీపంగా జియో స్టోర్ ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే కనుక మీరు జియో యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా దాన్ని తనిఖీ చేయవచ్చు లేదా మీరు దాని జియో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగ మీరు గూగుల్ లో లొకేషన్ కోసం కూడా శోధించవచ్చు.

Wi-Fi హాట్‌స్పాట్‌

మార్కెట్లో చాలా 4G VoLTE పరికరాలు ఉన్నప్పటికి కూడా JioFi చాలా ప్రజాదరణ పొందినది. మీరు మీ స్మార్ట్‌ఫోన్ నుండి నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ Wi-Fi హాట్‌స్పాట్‌లను సృష్టించవచ్చు. JioFi అనేది చాలా చిన్న పరికరం మరియు ఇది మీ ప్యాంటు జేబులో లేదా బ్యాగ్‌లో సులభంగా సరిపోతుంది మరియు ఇది చాలా సురక్షితమైన ఉత్పత్తిగా కూడా పరిగణించబడుతుంది. వాస్తవానికి ఇది బ్యాటరీల సాయంతో రన్ అవుతుంది. అంటే దాన్ని ఉపయోగించడానికి మీరు ఛార్జ్ చేయవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఇతర టెల్కోలు కూడా తమ కస్టమర్లకు ఇటువంటి ఉత్పత్తిని అందిస్తున్నాయి. కానీ రిలయన్స్ జియో దేశం మొత్తం మీద 4G నెట్‌వర్క్‌ని విస్తృతంగా కలిగి ఉన్నందున ఇంటర్నెట్ ని కనెక్ట్ చేయడానికి ఉత్తమ ఎంపికలలో JioFi మెరుగ్గా ఉంటుంది.

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడ్‌లలో అందిస్తుంది. మీరు తక్కువ మొత్తంలో ఖర్చు చేసి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ఉచితంగా OTT యాక్సెస్‌ని పొందాలనుకుంటే కనుక ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇందులో మొదటిది రూ.1797 ధర వద్ద లభిస్తుంది. దీనికి GST కూడా ఉంటుంది అని గమనించండి. ఇది మూడు నెలల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ పోస్ట్‌పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 30 Mbps వేగంతో నెలకు 3.3TB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. దీనితో పాటుగా డిస్నీ+ హాట్‌స్టార్, ZEE5, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, సన్‌ఎన్‌ఎక్స్‌టి, హోయిచోయ్, డిస్కవరీ+ లతో సహా 14 OTT యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తుంది. వినియోగదారులు 550+ కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. అదనంగా కంపెనీ జియో STBని కూడా ఉచితంగా కూడా అందిస్తుంది. జియోఫైబర్ వినియోగదారులు రూ.1797 మొత్తం కూడా అధికం అని భావిస్తే కనుక దీని కంటే కొద్దిగా తక్కువ ధర వద్ద లభించే ఇలాంటి 30 Mbps ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. రూ.1497 + GST ధర వద్ద లభించే ప్లాన్‌తో నెలకు 3.3TB డేటాను 30 Mbps వేగంతో పాటుగా 6 OTT యాప్‌లు మరియు మూడు నెలల పాటు 400+ లైవ్ టీవీ ఛానెల్‌ల ప్రయోజనాలను పొందవచ్చు. డేటా పరిమితి ఈ ప్లాన్‌కు కూడా వర్తిస్తుంది. ఆ తర్వాత రూ.1197 + GST ధర వద్ద మూడు నెలల చెల్లుబాటు కాలానికి లభించే మరో 30 Mbps ప్లాన్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌కి సంబంధించిన నిబంధనలు మరియు షరతులు పైన పేర్కొన్న వాటికి సమానంగా ఉంటాయి. కానీ వినియోగదారులకు ఎటువంటి OTT ప్రయోజనాలు ఉండవు అని గుర్తుంచుకోవాలి.

5G స్పెక్ట్రమ్ రేసులో రిలయన్స్ జియో

5G స్పెక్ట్రమ్ రేసులో రిలయన్స్ జియో

5G స్పెక్ట్రమ్ వేలం రేసులో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరియు అదానీ గ్రూప్ వంటి నలుగురు పెద్ద ఆటగాళ్లు ఉన్నారు. ఈ నలుగురూ కలిసి రూ.21,400 కోట్ల కోర్‌ను సీరియస్ మనీ డిపాజిట్ (EMD)లో సమర్పించారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 14,000 EMDని సమర్పించగా, భారతీ ఎయిర్‌టెల్ రూ. 5,500 కోట్ల EMDని సమర్పించింది. నగదు కొరతతో ఉన్న వోడాఫోన్ ఐడియా (Vi) తన ప్రాధాన్యత మార్కెట్‌లలో 5G ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేస్తుందని సూచిస్తూ రూ. 2,200 కోట్లను అర్జెంట్ డబ్బుగా సమర్పించింది. 4G స్పెక్ట్రమ్ కోసం 2021 వేలంలో రిలయన్స్ జియో వారి డిపాజిట్‌లో 77.9 శాతాన్ని ఉపయోగించగా, ఎయిర్‌టెల్ 87.7 శాతాన్ని ఉపయోగించింది. కానీ నిజం చెప్పాలంటే ఎక్కువ డబ్బు కూడా జియో వద్ద ఉంది. ఎయిర్‌టెల్ లాభదాయకంగా ఉండగలిగింది మరియు వ్యాపార కొలమానాలను మెరుగుపరుస్తుంది. అయితే జియో తన నెట్‌వర్క్‌లలో పెట్టుబడి పెట్టగల డబ్బును ఇప్పటికీ అక్కడ పెట్టుబడి పెట్టలేదు. Vodafone Idea (Vi) విలీనం అయినప్పటి నుండి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు మరియు అది 5G స్పెక్ట్రమ్ వేలంలో పెద్దగా పెట్టుబడి పెట్టకపోవడానికి కారణం దాని వద్ద గల డబ్బు కొరత కూడా కారణం.

Best Mobiles in India

English summary
Reliance Jio Offering 50% Cashback on The JioFi Device Purchase

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X