జియో 21న అనౌన్స్ చేయబోయేది ఇవే.. !
ఈ నేపథ్యంలో జియో రాక ఈ నెలకి ఏడాది పూర్తికానుండటంతో ఆ రోజు జియో ఏం ప్రకటిస్తుందా అని టెక్ వర్గాలు ఇప్పటికే చర్చలు మొదలెట్టాయి
జియో..వచ్చిన అనతి కాలంలోనే టెల్కోలకు చుక్కలు చూపించింది. ఉచిత డేటా, వాయిస్ ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించింది. అయితే ఉచిత ఆఫర్లు అయిన తరువాత టెల్కోలు కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి. జియో కూడడా రేట్లు ప్రకటించడంతో దానికి ధీటుగానే ఆఫర్లను ప్రకటిస్తూ వెళుతున్నాయి.
ఈ నేపథ్యంలో జియో రాక ఈ నెలకి ఏడాది పూర్తికానుండటంతో ఆ రోజు జియో ఏం ప్రకటిస్తుందా అని టెక్ వర్గాలు ఇప్పటికే చర్చలు మొదలెట్టాయి కూడా. ...జియో ఆ రోజున ప్రకటించబోతున్న ప్లాన్లకు సంబంధించి కొన్ని వివరాలు తెలిసాయి.

జియో రూ.500 ఫోన్
ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న జియో రూ. 500 ఫోన్ ను ఆ రోజు ప్రకటించే అవకాశం ఉంది.

డేటా ఆఫర్లు
ఆఫర్ల పరిమితి ముగిసిపోతున్న నేపథ్యంలో కొత్త ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది.

జియో యానివర్సరీ ఆఫర్
జియో వచ్చి ఏడాది పూర్తయిన సంధర్భంగా యానివర్సరీ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జియో పైబర్ బ్రాండ్
జియో ఆ రోజున పైబర్ బ్రాండ్ కి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది.

జియో టీవీ
దీనిపై క్లారిటీ లేదు. అయితే ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని టెక్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications








