Home
News

మారుమూల ప్రాంతాలలో కూడా ఫుల్ సిగ్నల్!! 4G నెట్‌వర్క్‌తో జియో వినూత్న ప్రయత్నం...

రిలయన్స్ జియో టెలికాం సంస్థ భారతదేశంలోని టెలికాం రంగంలోకి ప్రవేశించిన అతి కొద్ది కాలంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఎదిగింది. అయితే ఇప్పుడు రిలయన్స్ జియో సంస్థ తన యొక్క 4G నెట్‌వర్క్‌తో భారతదేశంలోని మారుమూల మరియు లోతైన ప్రాంతాలలో కూడా ఫుల్ సిగ్నల్ లను అందించడానికి ప్రయత్నిస్తోంది. ఓపెన్ సిగ్నల్ ప్రకారం రిలయన్స్ జియో యొక్క 4G నెట్‌వర్క్ లభ్యత మరియు కవరేజ్ భారతదేశంలోని ఇతర టెల్కోలతో పోలిస్తే ఉత్తమంగా ఉంది. కానీ లోయప్రాంతాలలో అన్ని టెల్కోల సిగ్నల్స్ వీక్ గా ఉన్నాయి. దీనికి చెక్ పెడుతూ జియో సంస్థ లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు సమీపంలోని స్పాంగ్మిక్ గ్రామంలో జియో 4G నెట్‌వర్క్ సేవలను ప్రవేశపెట్టింది. ఈ ప్రాంతంలో 4G నెట్‌వర్క్ సేవలను అందించే మొదటి టెలికాం ఆపరేటర్ జియో కావడం గమనార్హం.

జియో మొబైల్ టవర్‌

లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడికి భారతీయులే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతంలో జియో మొబైల్ టవర్‌ను గౌరవనీయులైన పార్లమెంటు సభ్యుడు జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ ప్రారంభించారు.

లడఖ్‌లో దూకుడుగా జియో 4G నెట్‌వర్క్ కవరేజ్

లడఖ్‌లో దూకుడుగా జియో 4G నెట్‌వర్క్ కవరేజ్

లడఖ్‌లో రిలయన్స్ జియో తన 4G నెట్‌వర్క్‌లను విస్తరించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలోని ప్రతి భాగానికి 4G నెట్‌వర్క్ చేరుకునేలా టెల్కో ఉద్యోగులు కఠినమైన లోయ ప్రాంతాలలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను అధిగమించి పనిచేసారు. మే 2022లో ఖాల్సీ బ్లాక్‌లోని కంజి, ఉర్బిస్ & హనుపట్టా గ్రామాలు మరియు డిస్కిట్ బ్లాక్‌లోని చుంగ్‌లుంగ్‌ఖా గ్రామం వంటి ప్రదేశాలలో జియో 4G నెట్‌వర్క్ సేవలను కూడా ప్రారంభించింది. లేహ్‌లో కూడా రిలయన్స్ జియో వినియోగదారులకు జియోఫైబర్ సేవలను అందిస్తోంది.

4G నెట్‌వర్క్

లడఖ్‌లో పర్యటించే జియో వినియోగదారులు తమ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటానికి బలమైన నెట్‌వర్క్ కనెక్షన్‌ని పొందేలా ఇది నిర్ధారిస్తుంది. టెల్కో ఇటీవలే కేదార్‌నాథ్‌లో 4G నెట్‌వర్క్ సేవలను అందించడం ప్రారంభించింది. దీని కారణంతో అక్కడికి వచ్చే యాత్రికులు తమకు నచ్చిన వారితో కనెక్ట్ చేయడం మరింత సులభం చేస్తుంది. ఇటీవల లాభదాయకత ఆందోళనల కారణంగా ఇతర ప్రైవేట్ టెల్కోలు లేని ప్రాంతాలపై జియో దృష్టి సారిస్తోంది. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్‌లలో ఒకదాని నుండి 4G నెట్‌వర్క్ సేవను ఎట్టకేలకు పొందగలుగుతున్నందున లడఖ్‌ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఇది పాంగోంగ్ సరస్సు మరియు స్పాంగ్మిక్ గ్రామాన్ని సందర్శించడంలో పర్యాటకుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది భవిష్యత్తులో వాణిజ్యానికి మంచి అవకాశాలను కలిగిస్తుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Telco is Trying to Reach the Deepest Corners of India With The 4G Network
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X