Home
News

2021 లో జియో సబ్‌స్క్రైబర్‌లను భారీగా కోల్పోయింది!! కారణం ఏమిటో తెలుసా

ఇండియాలోని టెలికాం రంగంలో సరికొత్త మార్పులకు మొదటగా శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో తరువాత ఎక్కువ మంది చందాదారులను అందుకొని అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. సెప్టెంబర్ 2021తో ముగిసే త్రైమాసికంలో రిలయన్స్ జియో సుమారు 11.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. ఈ త్రైమాసికంలో జియో టెల్కో సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు. ఈ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య తగ్గడానికి కారణం ఏమిటి? వంటి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్‌లను కోల్పోవడానికి గల కారణాలు

రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్‌లను కోల్పోవడానికి గల కారణాలు

ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రకారం సెప్టెంబర్ 2021 త్రైమాసికంలో జియో తన ఇన్‌యాక్టివ్ సబ్‌స్క్రైబర్ బేస్‌ను క్లీన్ చేసింది. ఇన్‌యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లను క్లీన్ చేసినప్పటికీ టెల్కోకు సగటు ఆదాయం (ARPU) వృద్ధి తక్కువగా ఉందని విశ్లేషకులు తెలిపారు. కాబట్టి జియో తన ఇన్‌యాక్టివ్ సబ్‌లను క్లియర్ చేయడం ఒక కారణం అని ఫిచ్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ నితిన్ సోనీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ "తక్కువ-చెల్లింపు వినియోగదారులను నిష్క్రియం చేయడం" సంస్థ యొక్క ARPU వృద్ధికి సహాయపడింది. ఇది చాలా కాలంగా జియో చేయాలనుకుంటున్నది అని తెలిపారు.

ఇన్‌యాక్టివ్ సబ్‌స్క్రైబర్ బేస్‌

ఇన్‌యాక్టివ్ సబ్‌స్క్రైబర్ బేస్‌ను క్లీన్ చేయడం అనేది ముందు ముందు దీర్ఘకాలంలో కంపెనీకి మేలు చేస్తుంది. ఈ త్రైమాసికంలో సబ్‌స్క్రైబర్‌లు తగ్గినప్పటికీ టెల్కో తన యాక్టివ్‌గా ఉన్న వాటి నుండి ఎక్కువ సంపాదిస్తోంది. వోడాఫోన్ ఐడియా మరియు భారతీ ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో ఇప్పటికీ మెరుగైన యాక్టివ్ సబ్‌స్క్రైబర్ శాతాన్ని కలిగి ఉంది. కానీ జియోకి పని చేసే ఒక విషయం ఏమిటంటే ఇది 4G కంపెనీ మాత్రమే. అంటే యాక్టివ్‌గా ఉన్న కస్టమర్‌లందరూ వారు తక్కువగా ఉన్నప్పటికీ 4G సేవలను వినియోగిస్తున్నారు. ARPU కూడా పెరగడంతో ఇది Jioకి మెరుగైన ఆదాయాన్ని అందిస్తుంది.

JioPhone Next

జియో స్థానంలో ఉన్న ఏ కంపెనీ అయినా ఇదే చేయాలనుకుంటుంది. రిలయన్స్ జియో జియోఫోన్ నెక్స్ట్‌ను ప్రారంభించే దాని ప్రణాళికల గురించి ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. కంపెనీ నుండి ఈ సరసమైన 4G స్మార్ట్‌ఫోన్ విజయవంతమైతే కనుక కంపెనీకి చాలా దూకుడుగా ఉన్న చందాదారుల చేరికకు దారి తీస్తుంది. అయితే JioPhone Next అనేది భారతదేశంలోని 2G ల్యాండ్‌స్కేప్‌ను మార్చడానికి ఉద్దేశించబడిందా లేదా మార్కెట్లో మరొక స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

JioPhone Next

గూగుల్ మరియు Qualcomm వంటి పెద్ద సంస్థలతో భాగస్వామ్యంతో జియో సంస్థ ఇప్పుడు బడ్జెట్ విభాగంలో స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయాలనుకునే లక్ష్యంతో జియోఫోన్ నెక్స్ట్ ను ప్రకటించింది. JioPhone Next ఫోన్ దీపావళి రోజున భారతదేశంలో ఆవిష్కరించబడుతుందని సంస్థ వెల్లడించింది. జూన్‌లో జరిగిన రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా JioPhone Next ను మొదటిసారి ప్రకటించబడింది. నవంబర్ 4న దీపావళి సందర్భంగా భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. జియోఫోన్ నెక్స్ట్ ప్రారంభ ధర సుమారు రూ.5,000 ఉండే అవకాశం ఉంది. 3GB RAM మరియు 64GB స్టోరేజ్ ఉన్న మోడల్ రూ. 7,000 ఖరీదు చేసే అవకాశం కూడా ఉంది. అయితే రిలయన్స్ జియో డేటా ప్యాక్ మరియు బ్యాంకుల నుండి ఇతర ఆఫర్లతో ధర దీని కంటే చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Reliance Jio Telco Lose Subscribers Massively in 2021 After Long-Time
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X