రూ.399తో రీఛార్జ్ చేస్తే రూ.3,300 మీ అకౌంట్లోకి, జియో మరో బంపరాఫర్
న్యూ ఇయర్ సమీపిస్తున్న తరుణంలో జియో తమ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్లకు తెరలేపింది.
న్యూ ఇయర్ సమీపిస్తున్న తరుణంలో జియో తమ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్లకు తెరలేపింది. న్యూయర్ కానుకగా రెండు రోజుల క్రితమే రెండు అదిరిపోయే ప్లాన్లను లాంచ్ చేసిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో బంపర్ క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.399 లేదా ఆపై అన్ని రీఛార్జ్లపై రూ.3,300 వరకు క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆఫర్లపై ఓ లుక్కేయండి

వచ్చే ఏడాది జనవరి 15 వరకు..
రూ.399, ఆపై మొత్తాల రీఛార్జ్లపై రూ.3,300 వరకు జియో సర్ప్రైజ్ క్యాష్బ్యాక్ అందిస్తుంది. ఈ సర్ప్రైజ్ క్యాష్బ్యాక్ ఆఫర్ వచ్చే ఏడాది జనవరి 15 వరకు రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

రూ.2599 క్యాష్బ్యాక్ ఆఫర్..
రూ.399 రీఛార్జ్పై జియో అందిస్తున్న రూ.2599 క్యాష్బ్యాక్ ఆఫర్కు నిన్నటితోనే గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరో క్యాష్బ్యాక్ ఆఫర్తో జియో తన కస్టమర్ల ప్రవేశపెట్టింది.

ఓచర్ల రూపంలో..
ఈ క్యాష్బ్యాక్ను రూ.400 మైజియో క్యాష్బ్యాక్ ఓచర్లు, వాలెట్ల నుంచి రూ.300 ఇన్స్టాంట్ క్యాష్బ్యాక్ ఓచర్లు, ఈ-కామర్స్ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్ ఓచర్ల రూపంలో ఆఫర్ చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

డిసెంబర్ 26 నుంచి 2018 జనవరి 15 వరకు..
2017 డిసెంబర్ 26 నుంచి 2018 జనవరి 15 వరకు మధ్యలో చేయించుకున్న అన్ని రీఛార్జ్లకు ఈ ఆఫర్ వాలిడ్లో ఉండనుందని పేర్కొన్నాయి.

టారిఫ్ల విషయంలో..
టారిఫ్ల విషయంలో జియో ఎప్పటికీ లీడరేనని, కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, టారిఫ్ల విషయంలో ఎంతదూరమైనా వెళ్లే ఒకే ఒక్క కంపెనీ తమదేనని జియో ప్రకటించింది.


Click it and Unblock the Notifications








