జియో ఉచిత వైఫై, వారికి మాత్రమే !
టెల్కోలకు ముచ్చెమటలు పట్టిస్తున్న జియో ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపేందుకు రెడీ అయిందా అంటే అవుననే రిపోర్టులు చెబుతున్నాయి.
టెల్కోలకు ముచ్చెమటలు పట్టిస్తున్న జియో ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపేందుకు రెడీ అయిందా అంటే అవుననే రిపోర్టులు చెబుతున్నాయి. జియో మరో సంచలనం దిశగా అడుగులు వేస్తుందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు జియో సిద్ధపడుతున్నట్లు తెలిసింది.

ఓ ప్రపోజల్ను కూడా పెట్టినట్లు సమాచారం.
ఈ మేరకు జియో ఇప్పటికే మానవవనరుల శాఖ(హెచ్ఆర్డీ)కు ఓ ప్రపోజల్ను కూడా పెట్టినట్లు సమాచారం.

ఉచితంగా వైఫై
గత నెలలో హెచ్ఆర్డీకు ఇచ్చిన ప్రెజెంటేషన్లో దేశంలోని 38 వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వైఫై సేవలు అందిస్తామని చెప్పినట్లు తెలిసింది.

మూడు కోట్ల కళాశాలలకు
భవిష్యత్తులో దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు ఇస్తామని చెప్పినట్లు రిపోర్టులు వచ్చాయి.

ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు
దీనిపై మాట్లాడిన ఓ హెచ్ఆర్డీ అధికారి.. వైఫై సేవలు ఉచితంగా అందిస్తామని రిలయన్స్ జియో చెప్తుండటంతో ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

మిగిలిన కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా
మిగిలిన కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా జియోకే పట్టం కట్టడం సరికాదు కాబట్టి టెండర్ ప్రాసెస్ను అమలు చేస్తామని అన్నారు.

టెండర్ దానికే
అయితే, ఉచితంగా సర్వీసులు జియో ఇస్తుంది కాబట్టి టెండర్ దానికే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications








