మరోసారి ఉచితంతో దూసుకొచ్చిన జియో
మెగా స్పోర్ట్స్ ఈవెంట్లు ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ జియో యూజర్ల కోసం మరో బంపరాఫర్ ని ప్రకటించింది.
మెగా స్పోర్ట్స్ ఈవెంట్లు ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ జియో యూజర్ల కోసం మరో బంపరాఫర్ ని ప్రకటించింది. నేటి నుంచి భారత-ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీటిని తిలకించేందుకు యువతను మరింత ప్రోత్సహించడానికి రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేటి నుంచి 18వ తేదీ వరకు జరగబోయే ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ను ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచీ జియోటీవీ యాప్లో లైవ్బ్రాడ్కాస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. అంతేకాక జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ను కూడా ఇది లైవ్గా బ్రాడ్కాస్ట్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్రీమియం కంటెంట్ అంతటిన్నీ జియో యూజర్లందరికి ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది.

ఎక్స్క్లూజివ్ డీల్స్
కంటెంట్ దిగ్గజాలు, బ్రాడ్కాస్టర్లతో కలిసి ఎక్స్క్లూజివ్ డీల్స్తో కంటెంట్ పోర్ట్ఫోలియోను జియో బలపరుస్తుందని కంపెనీ వర్గాలు చెప్పాయి.

13 కోట్ల మంది జియో టీవీ యూజర్లకు
తన 13 కోట్ల మంది జియో టీవీ యూజర్లకు వచ్చే కొన్ని రోజుల్లో ఆశ్చర్యకరమైన ఆఫర్లతో పాటు, పలు ప్రయోజనాలను అందించనుందని తెలిపాయి.

రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా
ఇటీవల కంపెనీ లాంచ్ చేసిన డబుల్ ధమాకా ఆఫర్తో ప్రీపెయిడ్ కస్టమర్లు అదనంగా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా పొందుతున్నారు.

బిఎస్ఎన్ఎల్
కాగా ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్తో 28 రోజుల కాలపరిమితిపై 4జిబి 3జి డేటా ఇవ్వనున్నట్టు బిఎస్ఎన్ఎల్ తెలిపింది.

స్పెషల్ డేటా ఎస్టివి 149
ఇది ఫుట్ బాల్ ప్రియులు కోసమని చెప్పి.. ‘ఫిఫా వరల్డ్ కప్ స్పెషల్ డేటా ఎస్టివి 149' పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

14 నుంచి జూలై 15 వరకు
అయితే ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. కానీ ఇందులో ఉచిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు వర్తించవని పేర్కొంది.


Click it and Unblock the Notifications








