మహా కుంభమేళాలో అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ.. తప్పిపోయిన వారిని క్షణాల్లో కలుపుతోంది!
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో భారతదేశం అబ్బురపరిచే టెక్నాలజీని ఉపయోగిస్తోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ ఆరు వారాల పండుగలో 45 కోట్ల మందికి పైగా భక్తుల భద్రత కోసం, తప్పిపోయిన వారిని గుర్తించడానికి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు, నీటి అడుగున పనిచేసే డ్రోన్లు, రోబోటిక్ బోయ్స్ (Robotic buoys) వంటి అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాకు అమెరికా, కెనడా దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది భక్తులు తరలి రావడం విశేషం. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం ప్రాంగణంలో రియల్ టైమ్లో జనసమూహాన్ని పర్యవేక్షించడానికి వేలాది కెమెరాలను ఏర్పాటు చేశారు.

* ఏఐని వాడుతున్నాం: రాజేష్ ద్వివేది
"తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి మేం మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్, AIని ఉపయోగిస్తున్నాం." అని టెక్నాలజీని పర్యవేక్షిస్తున్న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ ద్వివేది తెలిపారు. ఈ వ్యవస్థ 100% పర్ఫెక్ట్ కాకపోయినా, మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గతంలో, ఈ కార్యక్రమంలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు లేదా విడిచిపెట్టిన వృద్ధులను లాస్ట్-అండ్-ఫౌండ్ స్టేషన్లు, పబ్లిక్ అనౌన్స్మెంట్ల ద్వారా గుర్తించేవారు, కానీ వాటి ద్వారా చాలా తక్కువ మందిని గుర్తించేవారు.
ఇప్పుడు, AI టూల్స్ తప్పిపోయిన వ్యక్తుల డిజిటల్ చిత్రాలను సృష్టిస్తాయి, వీటిని కెమెరాల ద్వారా జన సమూహంలో స్కాన్ చేస్తారు. స్థానిక నివేదికల ప్రకారం, ఈ పద్ధతి ద్వారా మొదటి రోజే 250 మందికి పైగా వారి కుటుంబాలతో తిరిగి కలిశారు.
* మరిన్ని టెక్నాలజీలు
వ్యక్తులను ట్రాక్ చేయడానికి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, వైద్య సమాచారంతో కూడిన RFID రిస్ట్బ్యాండ్స్ను ఉపయోగిస్తున్నారు. అలాగే, ఒక మొబైల్ యాప్ ద్వారా ప్రజలు వారి కుటుంబ సభ్యులతో లైవ్ లొకేషన్ను షేర్ చేసుకోవచ్చు.
జనసమూహాలు పెరిగినప్పుడు అధికారులను తక్షణమే అప్రమత్తం చేయడానికి ఫేస్-లెవెల్ కెమెరాలు సహాయపడుతున్నాయి. గతంలో 1954, 2013లో జరిగిన తొక్కిసలాటలలో అనేక మంది మరణించారు. ఈ ప్రమాదాలను నివారించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
* ఏఐ పవర్ఫుల్ నిఘా
AI పరిశుభ్రతను, రోజుకు 5 లక్షలకు పైగా వాహనాల పార్కింగ్ను, గూగుల్ AI-పవర్డ్ మ్యాప్స్ ద్వారా నావిగేషన్ను కూడా నిర్వహిస్తోంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కృత్రిమ్ రూపొందించిన చాట్బాట్ సందర్శకుల ప్రశ్నలకు 11 భారతీయ భాషల్లో సమాధానం ఇస్తుంది. దీంతో పాటు, ఫోన్పే అత్యవసర పరిస్థితుల కోసం రూ.99 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండే ప్రయాణ బీమాను ప్రవేశపెట్టింది.
* సవాళ్లు కూడా ఉన్నాయి
ఇన్ని ప్రయోజనాలు ఉన్నా, డేటా దుర్వినియోగం, సైబర్ మోసాల గురించి ఆందోళనలు ఉన్నాయి. లేని వసతులను అందిస్తున్న ఫేక్ వెబ్సైట్లు ఇప్పటికే కొంతమంది భక్తులను మోసం చేశాయి. దీన్ని ఎదుర్కోవడానికి, ఉత్తరప్రదేశ్ పోలీసులు బాలీవుడ్ నటుడు సంజయ్ మిశ్రా నటించిన అవగాహన వీడియోను విడుదల చేశారు. AI పూర్తి స్థాయి లైఫ్ సేవర్ కాకపోయినా, మహా కుంభమేళాను లక్షలాది మంది భక్తులకు సురక్షితమైనదిగా, మరింత సమర్థవంతమైనదిగా మారుస్తుందనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications








