మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ .8 లక్షల కోట్లు దాటిన మొట్టమొదటి భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్లో 8 ట్రిలియన్ డాలర్లను దాటిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.8 లక్షల కోట్లు దాటిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ ధర రికార్డు స్థాయిలో రూ.1,262.50 కు పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ. 8.01 లక్షల కోట్లుగా నమోదైంది.

మొదటి స్థానంలో రిలయన్స్....
మొదటి స్థానంలో రిలయన్స్ కాగా రెండో స్థానంలో TCS ఉంది.

కొత్త సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకోవడంలో టాప్....
కొత్త సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకోవడంలో జియో అగ్రగామిగా ఉందని ట్రాయ్ డేటాలో వెల్లడైంది. ట్రాయ్ కొత్తగా విడుదల చేసిన డేటాలో జూన్ నెలలో భారత్ టెలికాం సబ్స్క్రైబర్ బేస్ 9.71 మిలియన్లుగా నమోదైనట్టు తెలిసింది.

గత త్రైమాసికంలో పెట్రోకెమికల్ రంగంలో పట్టు సాధించిన రిలయన్స్ సంస్థ......
గత త్రైమాసికంలో పెట్రోకెమికల్ రంగంలో పట్టు సాధించిన రిలయన్స్ సంస్థ జూన్ త్రైమాసిక ఫలితాల్లో దాని టెలికాం, రిటైల్ వ్యాపారం క్రమంగా మెరుగుపడింది.

జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ అలాగే స్మార్ట్ హోమ్ సొల్యూషన్.....
జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ అలాగే స్మార్ట్ హోమ్ సొల్యూషన్ వంటి పలు అంశాలు ఇన్వెస్టర్లకు గొప్ప నమ్మకం కలిగించింది అందువల్ల రికార్డు స్థాయిలో షేర్ పెరిగింది.దేశీయ టెలికాం మార్కెట్లో జియో యూజర్ల కోసం అందించిన ఫ్రీ డేటా ఫ్రీ కాల్స్ తో తమ సత్తా ఏంటో ముందే చాటుకుంది.

ఈ ఏడాది చివరి నాటికి అఫీషియల్గా అందుబాటులోకి రానున్న JioFiberసర్వీసు.....
ఈ ఏడాది చివరి నాటికి అఫీషియల్గా అందుబాటులోకి రానున్న JioFiberసర్వీసు 100ఎంబీపీఎస్ వేగంతో లభ్యం కానుంది. ఈ సర్వీసులో భాగంగా VoIP ఫోన్ ద్వారా యూజర్ అన్లిమిటెడ్ వాయిస్ అలానే వీడియో కాల్స్ చేసుకునేందుకు వీలుంటుంది. ఇవి కాకుండా, జియో టీవీ యాక్సిస్ను కూడా ఈ సర్వీసులో భాగంగా పొందే వీలుంటుంది.


Click it and Unblock the Notifications








