దూకుడు పెంచిన సామ్సంగ్, భారత్లో నెలకు 10 లక్షలు ఫోన్లు తయారీ
ఉత్పాదక శక్తిని మరింతగా పెంచేందుకు 4,915 కోట్ల పెట్టుబడి..
దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్సంగ్, భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలో సామ్స్ంగ్కు తయారీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్లో ఇప్పటికే స్మార్ట్ఫోన్లు, రిఫ్రీజరేటర్లు, టీవీలు తయారవుతున్నాయి. ఈ ప్లాంట్ ఉత్పాదక శక్తిని మరింతగా పెంచేందుకు 4,915 కోట్లను పెట్టబుడులుగా తీసుకువస్తున్నట్లు సామ్సంగ్ తెలిపింది.

వేల మందికి ఉపాధి
నోయిడాలోని ప్లాంట్ను అదనంగా 35 ఎకరాలకు విస్తరించటం వల్ల తయారీ సామర్థ్యం పెరగటంతో పాటు అదనంగా వేల మందికి ఉపాది లభిస్తుంది సామ్సంగ్ తెలిపింది.

రెండేళ్ల కాలంలో ఖర్చు చేస్తారు...
ఈ పెట్టుబడులను రానున్న రెండేళ్ల కాలంలో ఖర్చు చేయనున్నట్లు సామ్సంగ్ తెలిపింది. మేక్ ఇన్ ఇండియా విజన్కు తాము కట్టుబడి ఉన్నామని, ఈ పెట్టుబడులే అందుకు నిదర్శనమని సామ్సంగ్ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ HC Hong తెలిపారు.

ప్రస్తుతం నెలకు 50 లక్షల స్మార్ట్ఫోన్ యూనిట్లు
ప్రస్తుతానికి నెలకు 50 లక్షల స్మార్ట్ఫోన్ యూనిట్లను తయారు చేయగలుగుతున్నామని, విస్తరణ పనులు పూర్తి అయి తయారీ సామర్థ్యం పెరిగినట్లయితే నెలలకు 100 లక్షల స్మార్ట్ఫోన్లను తయారు చేయగలుగుతామని సామ్సంగ్ తెలిపింది.

టీవీలతో పాటు రిఫ్రీజరేటర్ల ఉత్పాదన కూడా..
ఇదే సమయంలో టీవీలతో పాటు రిఫ్రీజరేటర్ల తయారీ కూడా మరింత పెరుగుతుందని సామ్సంగ్ వెల్లడించింది.

నోయిడా ప్లాంట్ 1996లో ప్రారంభమైంది..
నోయిడా ప్లాంట్ను సామ్సంగ్ 1996లో ఏర్పాటు చేయగా, 1997 నుంచి టీవీల తయారీ మొదలైంది. 2005 నుంచి మొబైల్ ఫోన్ల తయారీని ప్రారంభించారు. సామ్సంగ్కు నోయిడాలోనే కాకుండా తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులోనూ ఒక ప్లాంట్ ఉంది.


Click it and Unblock the Notifications