మళ్లీ శ్యాంసంగ్కే పట్టం
వినియోగదారులను ఏ కంపెనీ బాగా ఆకట్టుకుంటోంది..అలాగే వినియోగదారులు నమ్మే అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ ఏదీ...ఏ కంపెనీని కష్టమర్లు అధికంగా నమ్ముతున్నారు.. ఇటువంటి విషయాలపై ట్రస్ట్ రీసెర్చి అడ్వైజరీ సంస్థ తన అధ్యయనాన్ని చేసింది.అయితే వినియోగదారుల నమ్మకమైన బ్రాండ్ గా శ్యాంసంగ్ తన హవాని కొనసాగించింది. శ్యాంసంగ్ ను వినియోగదారులు అత్యంత నమ్మకమైన బ్రాండ్ గా ఎన్నుకున్నారని ఈ సంస్థ అధ్యయనంలో తేలింది. మరి తరువాత ఏయే బ్రాండ్లు ఏయో స్థానాల్లో ఉన్నాయి వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
Read more at:నకిలీ ఏది..?ఒరిజినల్ ఏది...?

విశ్వసనీయమైన బ్రాండ్ లలో శ్యాం సంగ్ మొదటి స్థానం
2015 సంవత్సరంలో ఇండియాలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ లలో శ్యాం సంగ్ మొదటి స్థానాన్ని ఆక్రమించిందని టీఆర్ఎ తన అధ్యయనంలో తెలిపింది.

రెండవ స్థానంలో ఎల్ జి
వినియోగదారులను ఆకర్షించడంలో రెండవ స్థానాన్ని ప్రముఖ కంపెనీ ఎల్ జి ఆక్రమించిదని రీసెర్చి తెలియజేసింది.

తరువాతి ప్లేస్ లో నోకియా, సోని
తరువాతి ప్లేస్ లో నోకియా, సోని కంపెనీలు మార్కెట్ లో కష్టమర్లను ఆకర్షిస్తూ తమ సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నాయి

నాలుగవస్థానంలో టాటా గ్రూప్
ఇక డొమెస్టిక్ రంగంలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న టాటా గ్రూప్ కష్టమర్ల విశ్వసనీయతను చూరగొనడంలో నాలుగవస్థానంలో నిలిచింది.

5వ స్థానంలో డెల్
ఇక అమెరికా కంప్యూటర్ కంపెనీ డెల్ 5వ స్థానంలో నిలిచింది. వినియోగదారులను ఆకర్షించి దూసుకుపోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది.

100 బ్రాండ్లు... 230 కేటగిరిలు
ఈ సంవత్సరం 100 బ్రాండ్లను 230 కేటగిరిల నుంచి తీసుకున్నారు.

2313 మంది వినియోగదారులపై స్టడీ
వీటిపై తమ అభిప్రాయాన్ని చెప్పాలని దాదాపు 2313 మంది వినియోగదారులపై స్టడీ చేసింది.

16 నగరాల్లో స్టడీ
మొత్తం 16 నగరాల్లో ఈ స్టడీ జరిగిందని కంపెనీ చీప్ ఎగ్జిక్యూటివ్ చంద్రమౌళి తెలిపారు.

ఎల్ ఐసీ,అలాగే భారత్ పెట్రోలియం ఫాస్ట్ ట్రాక్
ఈ లిస్ట్ లో ఎల్ ఐసీ,అలాగే భారత్ పెట్రోలియం ఫాస్ట్ ట్రాక్,డోవ్ పెప్సి,డాబూర్ ,గూగుల్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.

తేల్చి చెప్పిన టీ ఆర్ ఎ రిపోర్ట్
తేల్చి చెప్పిన టీఆర్ ఎ రిపోర్ట్

గిజ్బాట్ పేజీని లైక్ చేయండి
ఈ పేజీని లైక్ చేయడం ద్వారా మీరు టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ పొందండి


Click it and Unblock the Notifications








