మీరు Samsung ఫోన్ వాడుతుంటే... ఈ ఫీచర్ గురించి తెలుసుకోండి! రిపేర్ లో కూడా మీ డేటా సేఫ్
సాధారణంగా మీ స్మార్ట్ ఫోన్ ను రిపేర్ కి తీసుకెళ్లినప్పుడు, మీరు మీ స్మార్ట్ఫోన్ను కొన్ని రోజుల పాటు రిపేర్ సెంటర్లో ఉంచవలసి వస్తుంది. అలాంటి సమయం లో మీ డేటా గురించి మీరు ఆందోళన చెందుతుంటారు. లేదా మీ మొత్తం డేటా ను ముందుగానే డిలీట్ చేసి backup చేసుకోవడం లాంటివి చేస్తుంటారు.ఇకపై మీరు ఇలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే శాంసంగ్ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది.ఈ ఫీచర్ ద్వారా మీ డేటా భద్రంగా ఉంటుంది. కొరియన్ సంస్థ ఈ సమస్యకు వినూత్నమైన సమాధానంతో ముందుకు వచ్చింది. సామ్సంగ్ దక్షిణ కొరియాలోని తన పరికరాలకు రిపేర్ మోడ్ అనే కీలకమైన ఫీచర్ను జోడిస్తోందని ప్రకటించింది.

Repair Mode
ఈ Repair Mode ను యాక్టివేట్ చేసినప్పుడు, రిపేర్ టెక్నీషియన్ పని చేస్తున్నప్పుడు కూడా మీ Galaxy స్మార్ట్ఫోన్లోని వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. Samsung రిపేర్ మోడ్ వినియోగదారులు తమ ఫోన్ రిపేర్లో ఉన్నప్పుడు ఏ డేటాను బహిర్గతం చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
వినియోగదారులు తమ ప్రైవేట్ డేటాను రిపేర్ కోసం పంపినప్పుడు వారి స్మార్ట్ఫోన్ల నుండి లీక్ కావడం లేదా దొంగిలించబడడం గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతారు. కనీసం Samsung Galaxy వినియోగదారులకైనా మనశ్శాంతిని అందించడానికి ఈ మోడ్ ఇక్కడ తీసుకువచ్చారు. కాబట్టి, ఉదాహరణకు, మీరు మీ పరికరంలో ఫోటోలు మరియు వీడియోలను పరిమితిలో ఉంచాలనుకుంటే, మీరు దాన్ని రిపేర్ మోడ్లో చేయవచ్చు.

రిపేర్ మోడ్ ను ఎలా ఆక్టివేట్ చేయాలో చూడండి
ఈ రిపేర్ మోడ్ ను ఎలా ఆక్టివేట్ చేయాలో చూడండి Settings > Battery And Device Care మెనులో కనిపించే రిపేర్ మోడ్ యాక్టివేట్ అయిన తర్వాత, స్మార్ట్ఫోన్ రీబూట్ అవుతుంది. ఆ తర్వాత, ఫోటోలు, సందేశాలు, ఖాతాలు మొదలైన వాటితో సహా మీ వ్యక్తిగత డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు మరియు డిఫాల్ట్ యాప్లు మాత్రమే యాక్సెస్ చేయబడతాయి. రిపేర్ మోడ్ నుండి బయటకు రావడానికి, వినియోగదారు పరికరాన్ని రీబూట్ చేయడం ద్వారా మరియు వేలిముద్ర లేదా నమూనా గుర్తింపు ద్వారా ప్రామాణీకరించడం ద్వారా ఈ మోడ్ నుండి బయటకు రావొచ్చు.

కొత్త అప్డేట్ ద్వారా వస్తుంది
న్యూస్రూమ్ సమాచారం ప్రకారం, ఈ శామ్సంగ్ రిపేర్ మోడ్ గెలాక్సీ S21 సిరీస్ ఫోన్లకు కొత్త అప్డేట్ ద్వారా వస్తుంది మరియు తరువాత భవిష్యత్తులో మరిన్ని మోడళ్లకు విస్తరించబడుతుంది. ఇండియా లో ఈ కొత్త అప్డేట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. అయితే,ఈ సారి వచ్చే కొత్త అప్డేట్ ద్వారా తీసుకురావొచ్చని అంచనాలున్నాయి.

కొత్త ఆఫర్
శాంసంగ్ ఇటీవలే ఇండియా లో కొత్త ఆఫర్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ ద్వారా ఫోల్డబుల్ మొబైల్స్పై "Buy now, pay later (ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి) ఆప్షన్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.అయితే ఈ ఆఫర్ కేవలం ICICI క్రెడిట్ కార్డుదారులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్ను పొందడానికి ICICI క్రెడిట్ కార్డుదారులు సామ్సంగ్ రిటైల్ అవుట్లెట్లను సంప్రదించాలని వెల్లడించింది.

ICICI బ్యాంక్ నుంచి
ఆ ఆప్షన్ ఎంచుకున్న వినియోగదారులు కొనుగోలు చేసిన ప్రోడక్ట్ పై 60శాతం పేమెంట్ను 18 నెలల్లో మంత్లీ పేమెంట్ గా చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత మిగిలిన 40శాతం పేమెంట్ బుల్లెట్ పేమెంట్ మాదిరి 19వ నెలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ICICI బ్యాంక్ నుంచి కనీసం రూ.1,50,000 క్రెడిట్ పరిమితిని కలిగి ఉన్న క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మాత్రమే... తమ కొత్త Samsung "ఇప్పుడే కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి" ఆప్షన్ పొందడానికి అర్హులని కంపెనీ పేర్కొంది.

ఈ ఆఫర్లో
ఈ కొత్త కొనుగోలు ఆప్షన్తో, వినియోగదారులు Samsung Galaxy S22 సిరీస్, Samsung Galaxy Z Fold 3 మరియు Galaxy Z Flip 3 వంటి స్మార్ట్ఫోన్లను జీరో డౌన్ పేమెంట్ తో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా.. కేవలం 1 శాతం కనీస ప్రాసెసింగ్ ఛార్జీ తో Samsung ఫ్లాగ్షిప్ మొబైల్ను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. అదనంగా బై నౌ, పే లేటర్ ఆఫర్ తో ఎవరైనా Samsung Galaxy S22 Ultra 5Gని కొనుగోలు చేస్తే వారికి మరో ఆఫర్ వర్తించనుంది. కంపెనీకి చెందిన గెలాక్సీ వాచ్ 4ని కేవలం రూ. 2,999కి పొందవచ్చు. అంతేకాకుండా.. Samsung Galaxy S22+ 5G లేదా Galaxy S22 5Gని కొనుగోలు చేసే వారు గెలాక్సీ బడ్స్ 2 ను రూ.2,999కి పొందవచ్చు.

Samsung Galaxy S22 సిరీస్
Samsung Galaxy S22 సిరీస్ మొబైల్స్ లో Samsung Galaxy S22 ధర రూ. 72,999 నుండి ప్రారంభమవుతుంది మరియు Galaxy S22 అల్ట్రా యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 1,09,999 వరకు ఉంటుంది. మరోవైపు Samsung ఫోల్డబుల్స్ Galaxy Z Flip 3 ధర రూ. 84,999 నుండి ప్రారంభమవుతుంది. Samsung Galaxy Z Fold 3 భారతదేశంలో రూ. 1,49,999 నుండి ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా.. సామ్సంగ్ కంపెనీ తమ నెక్స్ట్ జెనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ఆగస్టు 10న గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా విడుదల చేయనుంది. Samsung Galaxy Z Fold 4 మరియు Galaxy Z Flip 4 లను విడుదల చేయనుంది. రాబోయే ఫోల్డబుల్స్ పాత మోడల్స్తో పోలిస్తే అనేక మెరుగైన ఫీచర్లతో వస్తాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications








