దిమ్మతిరిగే ఆఫర్: శాంసంగ్ టీవీ కొంటే రూ. 70 వేల Galaxy S8 plus ఫోన్ ఉచితం
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ యూజర్ల కోసం అదిరే ఆఫర్లను ప్రకటించింది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ యూజర్ల కోసం అదిరే ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్ ఉత్సవ్ పేరుతో వస్తున్న ఈ ఆఫర్లపై ఏకంగా శాంసంగ్ Galaxy S8 plus ఫోన్ ని ఉచితంగా అందిస్తోంది. దీంతో పాటు శాంసంగ్ ఉత్పత్తుల కొనుగోలుపై వి నియోగదారులకు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్ ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఆఫర్లేంటో మీరే చూడండి.

ఈ రోజు నుంచి అక్టోబర్ 22 వరకు
ఈ ఫెస్టివల్ సేల్ దాదాపు నెల రోజుల పాటు కనువిందు చేయనుంది. ఈ రోజు నుంచి అక్టోబర్ 22 వరకు ఈ డిస్కౌంట్లు, ఆఫర్ల వెల్లువ సాగనుంది.

శాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీ కొన్న వారికి
ఎంపిక చేసిన శాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీ కొన్న వారికి 128 జీబీ స్టోరేజ్ , రూ.70,900 ఖరీదు చేసే ప్రీమియం శాంసంగ్ గెలాక్స్ ఎస్ 8 ప్లస్ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అలాగే 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్ వారంటీ తోపాటు, రూ.10వేల విలువ చేసే నో గ్యాప్ వాల్ మౌంట్ ఉచితం.

కొంచె ఖరీదైన వ్యవహారమే
అయితే ఇది కొంచె ఖరీదైన వ్యవహారమే. శాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. వాటి ప్రారంభ ధరే రూ. 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

యూహెచ్డీ టీవీ లేదా కర్వ్డ్ టీవీ కొంటే
ఇక చిన్న ఆఫర్ల విషయానికొస్తే యూహెచ్డీ టీవీ లేదా కర్వ్డ్ టీవీ కొంటే.. రూ. 23,990 విలువే చేసే సౌండ్ బార్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

శాంసంగ్ సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొంటే
మరో ఆఫర్ కింద శాంసంగ్ సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొంటే గెలాక్సీ జే 5 ప్రైమ్(ధర రూ.13,490, లేదా గెలాక్సీ జే 2 ప్రొ (రూ.9.090) ఉచితం

ఎస్బీఐ డెబిట్ ద్వారా జరిపిన కొనుగోళ్లపై 5 శాతం క్యాష్బ్యాక్
కచ్చితమైన బహుమతులు, వారంటీ స్కీం, సులభమైన ఈఎంఐలు , ఎంపిక చేసిన ఉత్పత్తులపై జీరో డౌన్ పేమెంట్ (ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా) అందిస్తోంది. ఎస్బీఐ డెబిట్ ద్వారా జరిపిన కొనుగోళ్లపై 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ ఉంది.


Click it and Unblock the Notifications








