Home
News

5G ఫ్రాడ్... మీ ఫోన్ లో ఈ message లింక్ లపై క్లిక్ చేయద్దు! చేసారో ఇక అంతే ..?

By Maheswara

గత వారం జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022లో, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 5G మొబైల్ నెట్‌వర్క్ ను భారతదేశంలో లాంచ్ చేసారు. ఈ వారం, జియో మరియు ఎయిర్‌టెల్ తమ 5G రోల్‌అవుట్ ప్లాన్‌లను మరియు భారతదేశం అంతటా 5G ప్రారంభ రోల్‌అవుట్ కోసం అర్హత ఉన్న నగరాల ప్రారంభ జాబితాను ప్రకటించాయి. భారతదేశం అంతటా 5G ఫోన్ లు కలిగిన యజమానులు తమ ఫోన్‌లలో 5G యొక్క శక్తి మరియు వేగాన్ని అనుభవించడానికి ఆసక్తిగా ఉన్నందున, హైదరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ ఇప్పుడు కొత్త స్కామ్ గురించి హెచ్చరించింది.

స్కామ్ వివరాలు

స్కామ్ వివరాలు

ఈ స్కామ్ యొక్క వివరాలు abplive ద్వారా నివేదించబడిన దాని ప్రకారం, అమాయక వ్యక్తులకు కాల్‌లు చేసి, వారి స్మార్ట్‌ఫోన్‌లలో వచ్చిన లింక్‌లను క్లిక్ చేసిన తర్వాత మోసగాళ్ళు బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును పోగొట్టుకున్నట్లు అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి.ఇది చాలా తీవ్రమైన మోసం కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ వింగ్ హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఇలాంటి 5G స్కామ్‌లకు దూరంగా ఉండండి.

ఫోన్‌లకు ప్రమాదకరమైన లింక్‌ను పంపుతారు

ఫోన్‌లకు ప్రమాదకరమైన లింక్‌ను పంపుతారు

తొలుత, కొంతమంది స్కామర్‌లు వినియోగదారుల ఫోన్‌లకు ప్రమాదకరమైన లింక్‌ను పంపుతారు. అంటే వారు ఈ లింక్ ద్వారా మీ సిమ్ 4G నుండి 5G నెట్‌వర్క్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి వినియోగదారులకు సహాయపడుతుందని అని చెప్తారు. కానీ 5G ని పొందాలనే ఆసక్తితో ఉన్న ప్రజలు, ఇది కొన్ని అధికారిక వార్తగా భావించి, ఈ లింక్‌పై క్లిక్ చేస్తారు, కానీ వాస్తవానికి ఇది సైబర్ నేరగాళ్లచే పంపబడి ఉండటం వల్ల మీరు దోపిడీ కి గురయ్యే అవకాశం ఉంది.

మీ ఫోన్‌లోని డేటా

మీ ఫోన్‌లోని డేటా

ఈ లింక్ ద్వారా మీ ఫోన్‌లోని డేటాను హ్యాక్ చేయడానికి హ్యాకర్ ను అనుమతిస్తుంది. దీని ద్వారా హ్యాకర్లు మీ ఫోన్‌లోని సమాచారాన్ని దొంగిలిస్తారు. మీరు లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత, నేరస్థులు బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను తెలుసుకున్న తర్వాత, వారు ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి సిమ్‌ను మార్చుకుంటారు. ఫలితంగా వ్యక్తులు వారి స్వంత SIMకి యాక్సెస్‌ను కోల్పోతారు.

5G అప్గ్రేడ్

5G అప్గ్రేడ్

దీని కారణంగా చాలా మంది వినియోగదారులు తమ ఫోన్‌లను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఫిర్యాదులు చేశారు. "4G నుండి 5Gకి మారండి" అని తెలియని నంబర్ లేదా పంపిన వారి నుండి వచ్చిన ఎటువంటి మెసెజ్ లలోని లింక్ లను క్లిక్ చేయవద్దని సైబర్ వింగ్ వినియోగదారులను హెచ్చరించింది. ఒకవేళ మీకు 5G అప్గ్రేడ్ గురించి సమాచారం కావాలన్నా లేదా ఇతర వివరాలకోసం SIM ప్రొవైడర్ యొక్క అధికారిక సైట్‌లో ఖచ్చితమైన వివరాలను తనిఖీ చేయడం ఎల్లప్పుడూ మంచిదని సూచించబడింది.

Airtel 5G

Airtel 5G

Airtel 5G Plus ప్లాన్ ఇప్పుడు భారతదేశంలోని 8 నగరాల్లో లైవ్‌లో ఉంది. ఇది ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్ మరియు వారణాసిలలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. జియో వినియోగదారుల కోసం, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు వారణాసిలలో 5G ట్రయల్స్ ప్రారంభమవుతున్నాయి. మీరు 5G సేవకు మారాలనుకుంటే, టెల్కో స్టోర్‌లను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.రానున్న నెలల్లో మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరించనున్నారు. మరోవైపు రిలయన్స్ జియో తన 5జీ సేవలను వచ్చే దీపావళి పండుగ సీజన్‌లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. మరో భారతీయ టెలికాం సంస్థ Vodafone Idea, దాని 5G లాంచ్ కోసం ఎలాంటి టైమ్‌లైన్ ఇవ్వలేదు. కానీ 5G లాంచ్ కోసం చాలా కృషి చేస్తున్నారు.

Best Mobiles in India

English summary
Scam Alert: 5G SIM Upgrade Messages And Links Are Fraud. Don't Click Links On Messages.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X