తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య...కారణం సెల్ ఫోన్
సెల్ ఫోన్ వ్యసనం తీసే ప్రాణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఓ 14 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది.
సెల్ ఫోన్ వ్యసనం తీసే ప్రాణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఓ 14 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ముంబై లో జరిగిన ఈ సంఘటన పిల్లలో పెరిగిపోతున్న సెల్ఫోన్ వ్యసనానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ దుర్ఘటనక సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తరచూ సెల్ ఫోన్ లో వీడియోలు ...
ముంబై లో ఉండే ఓ బాలిక (మైనర్ కావడం వలన పేరు మెన్షన్ చేయలేదు)తరచూ సెల్ ఫోన్ లో వీడియోలు చూడటం అలాగే వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. అది గమనించిన బాలిక తల్లి శుక్రవారం సెల్ లాక్కొని మందలించింది.

తల్లి తిట్టినా వెంటనే మనస్థాపానికి గురైన ఆ బాలిక...
తన తల్లి తిట్టినా వెంటనే మనస్థాపానికి గురైన ఆ బాలిక బాత్రూమ్ లోకి వెళ్లి తలుపు గడి పెట్టుకుంది. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో భయపడిన ఆ తల్లి ఇంట్లో ఉన్న వారిని అందరిని పిలిచి ఆ తలపు పగలగొట్టించింది.

బాత్రూం లో ఉన్న సీలింగ్ కు ఉరి వేసుకొని ఉంది....
తీరా తలుపు తెరిచి చూస్తే ఆ బాలిక బాత్రూం లో ఉన్న సీలింగ్ కు ఉరి వేసుకొని ఉంది.అప్రతమతమైన ఇంట్లో వాళ్ళు వెంటనే ఆ బాలికను ముంబై లో ఉన్న కేఈఎమ్ హాస్పిటల్ కి తరలించారు. అయితే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తుండగానే ఆ బాలిక మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు...
ఈ ఆత్మహత్య పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








