2018లో మొత్తం హవా..ఆ ఫోన్లదే!
వచ్చే ఏడాది మెయ్జు తన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది కొన్ని డివైసులను మాత్రమే మార్కెట్లోకి రిలీజ్ చేసిన మెయ్జు... అనుకున్నంత స్థాయిలో విక్రయించలేకపోయింది. మిగతా చైనా బ్రాండ్స్ లాగా మెయ్జు ఈ ఏడాది విజయాలను సొంతం చేసుకోలేదనే చెప్పవచ్చు.

అయితే...రానున్న ఏడాది మొదటి త్రైమాసికంలో మెయ్జు ఆరు కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. 2018లో మెయ్జు తన 15 వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంలో కంపెనీ ఆరు స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయాలనే పక్కా ప్రణాళికను రూపొందించుకుంది.
దీంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. Gizmochina రిపోర్ట్స్ ప్రకారం...వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఆరు స్మార్ట్ ఫోన్లలో..5 స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ exynos చిప్ సెట్ కలిగి ఉంటాయని పేర్కొంది. అయితే క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రొసెసర్ నుంచి పవర్ పొందడానికి రాబోయో స్మార్ట్ ఫోన్లు మీడియాటెక్ ద్వారా వస్తాయని తెలిపింది. చిప్ సెట్ రాబోయో exynos 9810 soc అనే వాదనలు కూడా ఉన్నాయి.
2018లో మెయ్జు 15వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా సంస్థ ఎప్పటికీ గుర్తుండిపోయేలా... ఒక ప్రత్యేకమైన ఎడిషన్ స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా మెయ్జు 15 ప్లస్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
మెయ్జు నుంచి ఈ మధ్యే ఒక ప్రత్యేక ఎడిషన్ మోడల్ స్మార్ట్ ఫోన్ ఇమేజ్ ను పరిశీలించింది. దాని ధర వివరాలు ఆన్ లైన్లో పెట్టింది. ఇమేజ్ షియోమీ ఎం మిక్స్ 2 లో కనిపించే ...ఫ్రంట్ ప్యానెల్ బాటమ్ బెజిల్ డిస్ల్పే తోపాటు సెల్ఫీ కెమెరా సెన్సర్ హౌజ్ ఉంది. రాబోయో మెయ్జు స్మార్ట్ ఫోను బెజిల్ లెస్ కాన్సెప్ట్ తో ఒక ఫుల్ స్క్రీన్ డిజైన్ కలిగి ఉండదు.
ఇప్పటి వరకు స్మార్ట్ మోడల్ హై ఎండ్ మోడల్ కోసం 3499యువాన్ ( సుమార్ రూ. 34,000) 2999యువాన్( సుమారు 29,000) వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications








