ఈ రోజు నుంచి స్మార్ట్ టీవీ లపై ధరలు పెరుగుతున్నాయి. అన్ని బ్రాండ్ల పై కూడా !
భారతదేశంలో పెద్ద స్క్రీన్ టెలివిజన్లు మరియు స్మార్ట్ టీవీల పై ధరలు పెరిగే అవకాశం ఉందని మనకు తెలిసిందే. ఈ ధరల పెరుగుదల ఓపెన్ సెల్ ప్యానెల్పై దిగుమతి సుంకం పన్ను పెరుగుదలతో నేరుగా ముడిపడి ఉంది. పెద్ద స్క్రీన్ టెలివిజన్లో అత్యంత ఖరీదైన భాగాలలో ఈ ఓపెన్ సెల్ ప్యానెల్ ఒకటి.

అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్ లైన్ ప్లాట్ఫామ్లలో
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్ లైన్ ప్లాట్ఫామ్లలో దాదాపు ప్రతి బ్రాండ్ టీవీ పైన ఇప్పటికే వారి అమ్మకం ధరను పెంచింది. ఉదాహరణకు, వన్ప్లస్ వై సిరీస్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 12,999, వద్ద లాంచ్ అయింది మరి ఇప్పుడు దీని ధర రూ. 14,999 అంటే మొత్తం రూ. 2,000 ధర పెరుగుదల జరిగింది.

అన్ని బ్రాండ్ల టీవీ లపై
అదేవిధంగా ఇతర బ్రాండ్ల టీవీ లపై కూడా ధరలు పెరిగాయి. షియోమి మి టివి 4 ఎ హారిజోన్ ఎడిషన్ను ఇటీవల రూ. 13,499, మరియు ఈ మోడల్ పై ధర రూ. 500. హైసెన్స్ యొక్క 32 అంగుళాల వేరియంట్ కూడా రూ. 11,990, మరియు ఇప్పుడు ఇది రూ. 12,990 ధరల పెరుగుదలతో రూ. 1,000.గా ఉంది.
భారతదేశంలో ఆధునిక స్మార్ట్ టీవీ తయారీదారులు చాలా మంది తమ అమ్మకం ధరలను పెంచారు. కాబట్టి, బ్రాండ్ మరియు స్క్రీన్ పరిమాణాన్ని బట్టి, అన్ని స్మార్ట్ టీవీ లపై కనీసం రూ. 500.అయినా ధర పెరుగుదల ఉంది.

టీవీ లపై ధరల పెరగటానికి కారణం ఏంటి ?
భారతదేశంలో పెద్ద స్క్రీన్ టీవీల తయారీ మరియు అసెంబ్లీకి మద్దతు ఇవ్వడానికి మేక్ ఇన్ ఇండియా లో భాగంగా , ఓపెన్ సెల్ ప్యానెల్స్పై భారత ప్రభుత్వం రిబేటును ఇచ్చింది. కాబట్టి, సాధారణ 18 శాతం దిగుమతి సుంకానికి బదులుగా, ఈ తయారీదారులు దిగుమతి సుంకం పన్నులో 12 శాతం మాత్రమే చెల్లించేవారు.

సెప్టెంబర్ 30 తో ముగిసింది
కానీ ,ఈ ప్రచార కాలం సెప్టెంబర్ 30 తో ముగిసింది, కాబట్టి 2020 అక్టోబర్ 1 అంటే ఈరోజు నుంచి OEM ఓపెన్ సెల్ ప్యానెల్స్పై పూర్తి 18 శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించాలి. ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరల పెరుగుదలతో, టీవీ బ్రాండ్లు ఈ పెరిగిన ధరను వినియోగదారుల పైన భారం వేయడం కారణంగా,వినియోగదారు కొనే ధరపైన పెరుగుదల కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








