ఫోన్ వాడొద్దన్నారని, వేలు కత్తిరించుకున్నాడు
నేటి ఆధునిక యువత జీవన అలవాట్ల పై టెక్నాలజీ పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత పలువురి యువతలో సమయ పాలన పూర్తిగా కొరవడినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గంటల తరబడి గేమ్స్ ఆడటం, సెల్ఫీల మోజులో ప్రమాదాలను కొనితెచ్చుకోవటం యువతకు పరిపాటిగా మారపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైనాలో చోటుచేుసుకున్న మరో సంఘటన ఈ వాదనాలకు మరింత బలం చేకూరుస్తుంది.

Read More : రూ.11,000 రేంజ్లో పవర్ఫుల్ ఫోన్
తల్లిదండ్రులు ఫోన్ వాడొద్దన్నందుకు మనస్థాపానికి గురైన ఓ 13ఏళ్ల బాలుడు తన చూపుడు వేలును కత్తిరించుకున్నట్లు గీక్డాట్కామ్ ఓ కథనంలో పేర్కొంది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ బాలుడు ఫోన్తోనే గడుపుతుండటంతో తల్లి మందలించిందట. ఆ తరువాత కొద్ది సేపటికే తండ్రి కూడా మందలించటంతో మనస్థాపానికి గురైన బాలుగు వంట గదిలోకి వెళ్లి చాకుతో తన చూపుడు వేలును నరక్కున్నాడు. బాలుడుని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించటంతో తెగిన వేలును తిరిగి అంటించేందుకు వైద్యులకు 3 గంటలు సమయం పట్టిందట.
Read More : 'AP SPEAKS'..ఇది ప్రభుత్వ యాప్
అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు మనిషి జీవన విధానాన్ని మంరిత సులభతరం చేసేసాయి. అయితే, అందుబాటులో ఉంది కదా అని టెక్నాలజీని మితిమీరి ఉపయోగించుకుంటే అటు మానసికంగా, ఇటు శారీరకంగా ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. మితిమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా చోటుచేసుకున్న పలు కేసులను నిశితంగా అధ్యయనం చేసిన వైద్య నిపుణులు అవాక్కయ్యే వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారు...

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. ప్రమాద ఘంటికలు
వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడటం వల్ల చేతి వేళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదముందని ఆర్థోపెడిక్ వైద్యునిపుణులు హెచ్చిరిస్తున్నారు.

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. ప్రమాద ఘంటికలు
రోడ్డు పై నడుస్తున్న సమయంలో చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ను వినటమనేది పెను ప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. ప్రమాద ఘంటికలు
సెల్ఫోన్లలో గంటల తరబడి మాట్లాడటం వల్ల మానసిక రుగ్మతలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. ప్రమాద ఘంటికలు
నకిలీ చార్జర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ లు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పొయిన ఘటనలను ఇటీవల కాలంలో చాలనే వింటున్నం. కాబట్టి, నకిలీ చార్జర్లకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. ప్రమాద ఘంటికలు
రోజు రెండు గంటల కన్నా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్న వారు ‘Computer vision syndrome అనే రుగ్మతకు లోనవుతున్నారట.

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. ప్రమాద ఘంటికలు
టెలివిజన్ను దగ్గరగా చూడటం వల్ల ఆ ప్రభావం కంటి పై ఉంటుందని నిపుణులు హెచ్చిరస్తున్నారు.

మితిమీరిన టెక్నాలజీ వినియోగం.. ప్రమాద ఘంటికలు
పిడుగుల పడుతున్న సమయంలో బహిరంగా ప్రదేశాల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను వాడటం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.


Click it and Unblock the Notifications








