ఢిల్లీలో 3 అమ్మాయిల పై దాడి చేసిన గుర్తు తెలియని దుండగలు
దేశ రాజధాని ఢిల్లీలో ఆడవాళ్లకు భద్రతలేదని మరో సారి తేలిపోయింది. నడి రోడ్డు పై కొందరు గుర్తు తెలియని దుండగలు 3 అమ్మాయిల పై దాడి చేసి వారి వద్ద ఉన్న మొబైల్స్ మరియు డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆడవాళ్లకు భద్రతలేదని మరో సారి తేలిపోయింది. నడి రోడ్డు పై కొందరు గుర్తు తెలియని దుండగలు 3 అమ్మాయిల పై దాడి చేసి వారి వద్ద ఉన్న మొబైల్స్ మరియు డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు. ఈ ఘటన ఢిల్లీ లోని Mahindra Park ఏరియా దగ్గర రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. ముగ్గురు అమ్మాయిలకి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటన చూసిన కొందరు వ్యక్తులు ఆ అమ్మాయిలని సమీపంలో ఉండే బాబా జగ్జివన్ రామ్ ఆసుపత్రికి తరలించారు.ఈ విషాద సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్ లో చదువుతున్నారు....
గాయపడిన అమ్మాయిలు జహంగీర్పూరి , సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్ లో చదువుతున్నారు.అందులో ఇద్దరు అమ్మాయిలు 9 వ తరగతి కాగా మరొక అమ్మాయి 8 వ తరగతి చదువుతుంది. స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తుండగా....
స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగలు వచ్చి ఈ 3 అమ్మాయిల పై దాడి చేసి వారి వద్ద ఉన్న మొబైల్స్ మరియు డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు.

తీవ్ర గాయాలు...
అందులో ఇద్దరి అమ్మాయిలకు ఛాతి దగ్గర మరొక అమ్మాయికి చేయి పై తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ సంఘటన చూసిన కొందరి వ్యక్తులు....
ఈ సంఘటన చూసిన కొందరు వ్యక్తులు వెంటనే ఆ అమ్మాయిల్ని సమీపంలో ఉన్న బాబా జగ్జివన్ రామ్ హాస్పిటల్ కి తరలించారు.అయితే అక్కడి హాస్పిటల్ సిబ్బంది మరొక హాస్పిటల్ అయిన సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ హాస్పిటల్ ని రెఫెర్ చేయగ ఆ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు.

FIR ఫైల్ చేసిన పోలీసులు....
FIR ఫైల్ చేసిన పోలీసులు ఆ ఏరియా యొక్క CCTV కెమెరాలో రికార్డు ఆధారంగా దుండగులను పట్టుకుంటామని తెలిపారు.


Click it and Unblock the Notifications








