ఇకపై మొబైల్ వాలెట్స్ లావాదేవీలు జరపలేరు, కారణం తెలుసుకోండి !
ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ వాలెట్స్ ఇకపై గడ్డు పరిస్థితులు ఎదుర్కోనున్నాయి. మార్చి నుంచి మొబైల్ వాల్లెట్స్ పనిచేయకపోవచ్చని పేమెంట్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు.
ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ వాలెట్స్ ఇకపై గడ్డు పరిస్థితులు ఎదుర్కోనున్నాయి. మార్చి నుంచి మొబైల్ వాల్లెట్స్ పనిచేయకపోవచ్చని పేమెంట్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. సెంట్రల్ బ్యాంక్ విధించిన గడువు ఫిబ్రవరి 2019తో ముగిసిపోతున్న నేపథ్యంలో మార్చి నుంచి ఈ వాల్లెట్ లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదముందని వారు చెబుతున్నారు. అక్టోబరు 11, 2017 న, ఆర్బిఐ ఒక సర్కులర్ జారీ చేసింది, వినియోగదారులు ఏ వాల్లెట్స్ ని అయితే ఉపయోగిస్తున్నారో దానికి సంబందించిన కెవైసి ని పూర్తి చేసుకోమని ఉత్తర్వులు జారీ చేసింది, ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం, మొబైల్ వాల్లెట్స్ లో మీ కెవైసిని పూర్తి చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28, 2019గా నిర్ణయించారు.

మార్చి నుంచి నిలిపివేసే అవకాశం
ఈ నేపథ్యంలో దేశంలో 95 శాతం మొబైల్ వాల్లెట్స్ తమ ఆపరేషన్ ని మార్చి నుంచి నిలిపివేసే అవకాశం ఉందని New Delhi-based payments company అధికారులు చెబుతున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు తరువాత
సుప్రీంకోర్టు పేపర్ లెస్ వెరిఫికేషన్ చేపట్టాలని ఆధార్ తప్పనిసరి కాదని చెప్పిన తరువాత ఆర్ బిఐ దీనిపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఇఖపై కస్టమర్లు ఆధార్ తో పని లేకుండా పేపర్ లెస్ వెరిపికేషన్ చేయించుకోవచ్చని కంపెనీలు కూడా అదేబాటలో నడవాలని చెప్పింది.

క్లారిటీ ఇవ్వని ఆర్ బిఐ
కాగా దనిపై ఆర్బీఐ నుంచి పూర్తి స్తాయిలో ఎటువంటి క్లారిటీ రావడం లేదు.eKYC ఎలా చేపట్టాలో తెలియదు. అల్ట్రానేట్ ప్రాసెస్ ఏంటనేదానిపై ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం లేదు.

దూసుకొస్తున్న డెడ్ లైన్
కాగా ఆర్బీఐ విధించిన డెడ్ లైన్ దూసుకొస్తున్న నేపథ్యంలో మొబైల్ వాల్లెట్ ఆపరేషన్ల పై కంపెనీలకు ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇతర పద్దతుల ద్వారా అంటే video-based verification or XML-based KYC వంటివి చేపట్టాలనే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. బ్యాంకుల నుంచి దీనిపై స్పందన రావాల్సి ఉంది.

పనులు వేగవంతం చేసిన కంపెనీలు
సెంట్రల్ బ్యాంకు ఆర్డర్ తో పేమెంట్ వాల్లెట్ దిగ్గజాలు తమ పనులను వేగవంతం చేశాయి. PhonePe, Amazon Pay and Paytm లాంటి కంపెనీలు ఇప్పటికే తమ కస్టమర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా చెప్పాయి.

పేమెంట్ కంపెనీల ఆందోళన
కాగా ఈ రకమైన వెరిఫికేషన్ పై కంపెనీలు కొంచెం నిరాశను వ్యక్తం చేస్తున్నాయి. మొదటి స్టేజ్ వెరిఫికేషన్ లోనే ఉండటం బయోమెట్రిక్ లో పుల్ వెరిఫికేషన్ ఎలా చేయాలో తెలియకపోవడం వంటి సమస్యలు కంపెనీలను తల తిప్పుకోనీయడం లేదు.అయితే పేపర్ డాక్యుమెంట్లు అయితే కాస్ట్ పరంగా కూడా మాకు లాభమని కంపెనీలు వాదిస్తున్నాయి.

పార్లమెంట్ లో ఆమోదం కోసం ఎదురుచూపు
కాగా కంపెనీలు దీనికి సంబంధించి పెండింగ్ లో ఉన్న legislation పార్లమెంటులో అప్రూవ్ అయితే ఆధార్ నంబర్ ద్వారా వెరిఫికేషన్ ఆఫ్ లైన్లో కాని ఆన్ లైన్లో కాని చేసుకోవచ్చని భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








