ఏపీ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు!
డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రపోజల్తో ముందుకొచ్చింది. "ఆవిష్కరణ ప్రోత్సాహాలు" పేరుతో విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లను పంపిణి చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోన్నట్లు సమాచారం.

(పాత చిత్రం)
Read More : వాయిస్ కాల్స్ చేసుకుంటే డేటా కట్ అవ్వదు.. క్లారిటీ ఇచ్చిన జియో
విద్యార్థుల్లో డిజిటల్ అక్షరాస్యతను మెరుగుపరచటంతో పాటు వారిలో సృజనాత్మక ఆలోచనలను వెలికి తీసేందుకు ఈ ప్రక్రియ దోహదపడగలదని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వలోని రాష్ట్ర కేబినేట్ భావిస్తోంది. ఈ ఉచిత స్మార్ట్ఫోన్ల పంపిణికి సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది.
Read More : చేతిలో పేలిన Jio LYF స్మార్ట్ఫోన్!

డిజిటల్ ఇండియా అంటే..?
కమ్యూనికేషన్ ప్రపచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను దేశనలుమూలలకు విస్తరింపజేసే లక్ష్యంతో ప్రారంభమైన ‘డిజిటల్ ఇండియా' దేశ చరిత్రలో ఓ ముందడుగు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా పథకం ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను సామాన్యుల చెంతకు చేర్చే ప్రయ్నతం చేస్తోంది.

#1
దేశ అభివృద్థికి కీలకంగా భావిస్తోన్న ఈ-గవర్నెన్స్, ఈ - క్రాంతి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, బ్రాండ్ బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టువిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇంకా ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే ఈ ప్రథకం ప్రధాన లక్ష్యం. డిజిటల్ ఇండియా వారంలో భాగంగా ప్రారంభమైన పలు డిజిటల్ సేవల వివరాలను ఇప్పుడు చూద్దాం...

#2
బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకుంటున్నట్లుగానే పాన్కార్డ్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలను కేంద్ర ప్రభుత్వం అందించే డిజిటల్ లాకర్లో సౌకర్యవంతంగా భద్రపరుచుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా ఈ వ్యవస్థను డిజైన్ చేసారు.

#3
MyGov.in ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రభుత్వ వ్యవహారలన్నీ సమన్వయరీతిలో పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చి సుపరిపాలనకు దోహదపడుతుంది.

#4
స్వచ్చ్ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.

#5
ఈ - సంతకం ద్వారా పౌరులు తమ ఆధార్ కార్డ్లను ఉపయోగించుకుని డాక్యుమెంట్ల పై డిజిటల్ సంతకాలను చేయవచ్చు. తద్వారా డబ్బు, సమయం ఆదా అవటంతో పాటు మీ సంతకానికి చట్టబద్ధంగా గుర్తింపు ఇంకా గోప్యత లభిస్తుంది.

#6
ఈ - ఆస్పత్రి పథకం ద్వారా పారదర్శకమైన ఆరోగ్య సేవలను దేశ పౌరులు పొందవచ్చు. ఆన్లైన్ అపాయింట్మెంట్, రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, రక్తం అందుబాటు వంటి ముఖ్యమైన సేవలను ఈ - ఆస్పత్రి పథకం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొందవచ్చు.

#7
జాతీయ ఉపకారవేతన పోర్టల్ చేకూరే ప్రయోజనాలు: ఈ పోర్టల్ ద్వారా ఉపకారవేతనాలకు అర్హులైన విద్యార్థులు కాలపరిమితిలోపు తమ అప్లికేషన్ లను పంపించటంతో పాటు తమ ఉపకార వేతనాల బదిలీ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

#8
ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి అన్ని రికార్డులను డిజిటలైజ్ చేసే కార్యక్రమమే డిజిటైజ్ ఇండియా ప్లాట్ఫామ్.

#9
దేశంలోని 2,50,000 గ్రామ పంచాయితీలకు హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించే లక్ష్యంతో భారత్ నెట్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. బీఎస్ఎన్ఎల్ తరువాతి జనరేషన్ నెట్వర్క్ను ప్రజలకు చేరువచేయటం. బీఎస్ఎన్ఎల్ ఉచిత వై-ఫై హాట్స్పాట్లను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయటం


Click it and Unblock the Notifications








