టాబ్లెట్ల అమ్మకాలు భేష్!

అగ్రశ్రేణి టెక్నాలజీ మార్కెట్లలో ఒకటైన భారత్లో టాబ్లెట్ కంప్యూటర్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. 2014, జూలై- సెప్టంబర్ త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే టాబ్లెట్ పీసీల విక్రయాలు 10 శాతం పెరిగాయని సంస్థ వివరించింది. 2013, జూలై- సెప్టంబర్ త్రైమాసికంలో 860,000 యూనిట్లుగా ఉన్న టాబ్ల విక్రయాలు ఈ ఏడాది ఇదే క్వార్టర్కు 940,000కు పెరిగాయని ఐడీసీ తెలిపింది.
పండుగల సీజన్ అంతేకాకుండా వాణిజ్య సంస్థల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో టాబ్లెట్ పీసీల అమ్మకాలు పెరియగాని సదరు రిసెర్చ్ సంస్థ విశ్లేషించింది. నమోదైన అమ్మకాల్లో భాగంగా 22 శాతం మార్కెట్ వాటాతో సామ్సంగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్ (10.9%), ఐబాల్ (10.6%), డేటావిండ్ (8.2%), యాపిల్ (6.7%) శాతాలతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. వీటిలో 90 శాతం టాబ్లెట్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించేవి కావటం విశేషం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








