హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా డ్యూయల్ సిమ్తో కూడిన 3జీ మొబైల్ 'సీ 999'ను సెల్కాన్ మొబైల్స్ మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్లో జరిగిన కార్యక్రమంలో సెల్కాన్ ప్రచారకర్త, సినీ నటి తమన్నా ఈ మొబైల్ను ఆవిష్కరించారు. క్వెర్టీ కీప్యాడ్ గల ఈ మొబైల్తో అధిక నాణ్యత గల వీడియో కాల్స్, మొబైల్ టీవీ, ఆన్లైన్ వీడియోలు తిలకించవచ్చని సెల్కాన్ మేనేజింగ్ డైరెక్టర్ వై.గురు తెలిపారు.
ఈ ఫోన్ ధర రూ.4,799 అని ఆయన చెప్పారు. ఆధునిక ఫీచర్లు ఉన్న మొబైల్ ఫోన్లతో సెల్కాన్ ప్రజాదరణ పొందుతోందని తమన్నా పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించిన సెల్కాన్, మరిన్ని మోడళ్లతో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేతినేని మురళి చెప్పారు.