Sim Card, IMEI నంబర్లు మారిస్తే 3ఏళ్లు శిక్ష తప్పదు !
సెల్ఫోన్ చోరీ దారుల ఆటలను కట్టించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
సెల్ఫోన్ చోరీ దారుల ఆటలను కట్టించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మొబైల్లో కీలకమైన 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐఎంఈఐ) మార్చితే కఠిన శిక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపధ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం(డాట్) కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది.

3 సంవత్సరాల వరకు
ఐఎంఈఐ టాంపరింగ్ చేసినా, మార్చినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు జరిమానాను ప్రభుత్వం విధించనుంది.

ఉత్పత్తి దారుడు తప్ప
ఉత్పత్తి దారుడు తప్ప మిగిలిన ఎవరైనా ఐఎంఈఐ నెంబర్ను మార్చడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

2017 నిబంధనల ప్రకారం
15 డిజిట్ల ఈ నెంబరును టాంపరింగ్ చేస్తే ఐఎంఈఐ 2017 నిబంధనల ప్రకారం చట్టరీత్యా శిక్షకు అర్హులని పేర్కొంది.

కోల్పోయిన మొబైల్ ఫోన్ల ట్రాకింక్ను
నకిలీ ఐఎంఈఐ సంఖ్యలకు సంబంధించిన సమస్యలను అరికట్టడానికి , కోల్పోయిన మొబైల్ ఫోన్ల ట్రాకింక్ను కూడా సులభతరం చేయనున్నామని టెలికాం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

భారతీయ టెలిగ్రాఫ్ చట్టం 2017
భారతీయ టెలిగ్రాఫ్ చట్టం 2017 చట్టంలోని 7, 25 సెక్షన్ల ప్రకారం ఈ నిబంధనలను రూపొందించింది

అన్ని నెట్వర్క్లను బ్లాక్ ..
మొబైల్చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త పద్ధతిని టెలికాం శాఖ అమల్లోకి తెస్తోంది. చోరీకి గురైన ఫోన్లలో సిమ్ కార్డు మార్చినా, ఐఎంఈఐ నెంబర్ను మార్చినా అన్ని నెట్వర్క్లను బ్లాక్ చేయనుంది.


Click it and Unblock the Notifications








