Home
News

తొలిసారి ఐఫోన్లను తయారుచేయనున్న భారతీయ సంస్థ.. కీలక దశకు ఒప్పందం!

ప్రతిష్టాత్మక ఆపిల్‌ సంస్థ ఐఫోన్లను (Apple iphone) భారత్‌లో తొలిసారిగా భారతీయ సంస్థ తయారు చేయనుంది. ఇప్పటి వరకు భారత్‌లో ఐఫోన్లను తయారీచేసిన విస్ట్రాన్‌ యూనిట్‌ను టాటా సంస్థ కొనుగోలు చేసింది. ఫలితంగా టాటా సంస్థ ఐఫోన్లను త్వరలో తయారు చేయనుంది.

తెవాన్‌కు చెందిన విస్ట్రాన్‌ సంస్థ.. భారత్‌లో తన ఐఫోన్ల తయారీ ఫ్లాంట్‌ (కర్ణాటకలో ఉంది)ను సుమారు రూ.1040 కోట్లకు టాటా సంస్థకు విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో టాటా ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఐఫోన్ల తయారీ చేయనున్నట్లు తొలి భారతీయ సంస్థగా నిలవనుంది. ఐఫోన్ల తయారీ ప్లాంట్‌ విక్రయ ఒప్పందాన్ని అక్బోబర్ 27న నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tata acquires winston plant

కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. ప్రధాన మంత్రి మోడీ PLI పథకం కింద టాటా గ్రూప్‌ వచ్చే రెండున్నర సంవత్సరాల్లో భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించనుంది. టాటా తయారీచేసిన ఐఫోన్లు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించారు. దీంతోపాటు ఓ పత్రికా ప్రకటనను కూడా పంచుకున్నారు.

టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసేందుకు విస్ట్రాన్‌ సంస్థ తన అనుబంధ సంస్థలు SMS ఇన్ఫోకామ్‌ (సింగపూర్‌), విస్ట్రాన్‌ కాంగ్‌ లిమిటెడ్‌లకు అనుమతి మంజూరుచేసినట్లు ఈ ప్రకటనలో ఉంది. ఈ రెండు సంస్థల అంగీకారం తర్వాత టాటా, విస్ట్రాన్‌ సంస్థల మధ్య ఒప్పందం తర్వాత దశకు వెళ్తుందని తెలుస్తోంది.

ఐఫోన్‌ల తయారీ సంస్థ విస్ట్రాన్‌ ప్లాంట్‌ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో ఉంది. సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన టాటా గ్రూపు అనేక రంగాలకు విస్తరించి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ వైపు అడుగులు వేస్తోంది. టాటా సంస్థకు తమిళనాడు రాష్ట్రంలో వందల ఎకరాల్లో అతిపెద్ద ఫ్యాక్టరి ఉంది. ఇందులో ఐఫోన్‌ ఛాసిస్‌ను తయారు చేస్తోంది. దీంతోపాటు చిప్‌ తయారీలోనూ గుర్తింపు తెచ్చుకుంది.

సెప్టెంబర్‌ 12న నిర్వహించిన వండర్‌లస్ట్‌ ఈవెంట్‌లో ఆపిల్ సంస్థ ఐఫోన్‌ 15 సిరీస్‌ను విడుదల చేసింది. భారత్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్‌, పసుపు రంగుల్లో లభిస్తుంది.

ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్‌ ధర రూ. 1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ రూ.1,59,900గా ఉంది. బ్లాక్‌ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫోన్లు OLED సూపర్‌ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 2000 నిట్స్‌ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి.

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫ్లాట్‌ ఎడ్జ్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్‌ చిప్‌ ఆధారంగా పనిచేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata acquires winston plant and become first indian iphone maker in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X