Tata Sky మల్టీ టీవీ కనెక్షన్ల మీద భారీగా మార్పులు
ఇండియాలోని డిటిహెచ్ పరిశ్రమలో టాటా స్కై ప్రీమియం డిటిహెచ్ ఆపరేటర్గా పేరును సంపాదించింది. డిటిహెచ్ సర్వీస్ పరిశ్రమలో ఇది ప్రస్తుతం చౌకైన సెట్-టాప్ బాక్స్లను అందిస్తున్నది. వీటితో పాటుగా ఛానెల్ కనెక్షన్ల విషయాలలో ఇది మిగితా అన్ని డిటిహెచ్ ఆపరేటర్లతో పోలిస్తే టాటా స్కై ప్రతి మల్టీ టివి కనెక్షన్ కోసం ఎక్కువ వసూలు చేస్తోంది. కొత్త ట్రాయ్ టారిఫ్ పాలన తరువాత టాటా స్కై తన మల్టీ టివి విధానంలో అతి పెద్ద మార్పులను చేసింది.

వాస్తవానికి డిటిహెచ్ ఆపరేటర్ తన పాత మల్టీ టీవీ పాలసీని పూర్తిగా తొలగించి ‘రూమ్ టీవీ' అనే కొత్త సర్వీసుతో ముందుకు వచ్చారు. ఈ కొత్త సర్వీసులో భాగంగా టాటా స్కై తన సెకండరీ కనెక్షన్ హోల్డర్ల వద్ద నుండి పూర్తి రూ.153 NCF వసూలు చేస్తోంది. మల్టీ టివి కనెక్షన్ల కోసం ఎన్సిఎఫ్పై ఏదైనా తగ్గింపు ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని ఆపరేటర్లకు సెక్టార్ రెగ్యులేటర్ ట్రాయ్ ఇచ్చారు.

మల్టీ టీవీ కనెక్షన్ల కోసం తగ్గిన NCF తో వినియోగదారులను ఆకర్షించడానికి డిష్ టివి మరియు ఎయిర్టెల్ డిజిటల్ టివిలు మొదటిగా ప్రయత్నం చేసాయి. అయితే టాటా స్కైకి అదే ఆదాయాన్ని సంపాదించింది. ట్రాయ్ యొక్క నేషనల్ టారిఫ్ ఆర్డర్ 2.0 టాటా స్కై యొక్క మల్టీ టీవీ విధానంలో చాలా అవసరమైన మార్పులను తెస్తుంది.

టాటా స్కై మల్టీ టీవీ వినియోగదారులకు 40% NCF
మల్టీ టీవీ కనెక్షన్ల కోసం ఆపరేటర్లు ఎన్సిఎఫ్గా 40% మాత్రమే వసూలు చేయాలనీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొంది. ప్రాథమిక కనెక్షన్ యొక్క ధరలోని NCF ఆధారంగా సెకండరీ కనెక్షన్ మీద 40% ఎన్సిఎఫ్ లెక్కించబడుతుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ ప్రాధమిక కనెక్షన్ కోసం ఎన్సిఎఫ్గా రూ.153 చెల్లిస్తుంటే అతను సెకండరీ కనెక్షన్ కోసం ఎన్సిఎఫ్ 40% తక్కువగా ఉంటుంది.

FTA ఛానెళ్
రూ.153 బేస్ స్లాబ్ ప్లాన్ తో మొత్తంగా 200 FTA ఛానెళ్లను అందించాలని ట్రాయ్ యోచిస్తున్నందున ప్రతి కనెక్షన్కు మల్టీ టీవీ ఛార్జీలు ఇప్పుడు కేవలం రూ.64 మాత్రమే వర్తిస్తాయి. అంటే టాటా స్కై మల్టీ టీవీ వినియోగదారుల నుండి ఎన్సీఎఫ్గా రూ .64 మాత్రమే వసూలు చేయగలదు.

ప్రస్తుత టాటా స్కై మల్టీ టీవీ ఛార్జీలు
జూన్ 2019 లో టాటా స్కై తన మల్టీ టివి పాలసీని పూర్తిగా రద్దు చేసి ‘టాటా స్కై రూమ్ టివి' అనే కొత్త సర్వీసుతో ముందుకు వచ్చింది. టాటా స్కై నుండి వచ్చిన ఈ సర్వీస్ కొన్ని సంవత్సరాలుగా వినియోగదారులు అడుగుతున్న కొన్ని కీలక మార్పులను తీసుకువచ్చింది. ఉదాహరణకు మొదటి కనెక్షన్ నుండి ఛానెల్లను ప్రతిబింబించే బదులు రెండవ కనెక్షన్ హోల్డర్లను వారికి నచ్చిన ఛానెల్ ప్యాక్ని ఎంచుకోవడానికి 'టాటా స్కై రూమ్ టీవీ' అనుమతించింది. టాటా స్కై వ్యక్తిగత ఛానల్ ఎంపికతో మల్టీ టీవీ వినియోగదారులు కూడా పూర్తి ఎన్సిఎఫ్ను రూ.153 చెల్లించవలసి ఉంటుంది.

ట్రాయ్ NTO 2.0
మార్చి 1 న కొత్త ట్రాయ్ NTO 2.0 నియమాలు అమలులోకి వచ్చిన తర్వాత కొత్త మార్పులకు టాటా స్కై ఎలా స్పందిస్తుందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ట్రాయ్ ప్రతిపాదించిన ధర మార్పులను ప్రసారకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున NTO 2.0 అమలు ప్రమాదంలో ఉంది. ఈ విషయంపై తదుపరి విచారణ ఫిబ్రవరి 26 న బొంబాయి హెచ్సిపై, ఫిబ్రవరి 28 న కేరళ హెచ్సిలో జరగనుంది. NTO 2.0 ఛానల్ చందాలను 14% వరకు సరసమైనదిగా చేస్తుంది.


Click it and Unblock the Notifications