Just In
- 17 min ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 2 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 4 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 6 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- News
తొందరెందుకు.. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత దాని సంగతి చూద్దాం!
- Sports
IND vs NZ: శతక్కొట్టిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం!
- Lifestyle
సృజనాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండేలా పిల్లలను ఇలా పెంచండి
- Movies
ప్రభాస్ హృతిక్ రోషన్ కాంబినేషన్ నిజమే కానీ.. మరో చిన్న ట్విస్ట్!
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Finance
Jio 5G: కొత్త రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
కుంటిసాకులు చెప్పకండి, టెలికాం దిగ్గజాలను ఆడేసుకున్నకేంద్రం !
ఇప్పటిదాకా కాల్ డ్రాప్స్ పై కుంటి సాకులు చెబుతున్నారని ఇకపై అలాంటి సాకులు చెప్పే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని టెలికాం దిగ్గజాలకు కేంద్రం గట్టిగా నొక్కి చెప్పింది. వినియోగదారులను ఇబ్బందిపెడుతున్న కాల్ డ్రాప్స్ సమస్యపై టెలికాం ఆపరేటర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికాం శాఖ (డాట్) సెక్రటరీ అరుణ సుందరరాజన్ మాట్లాడుతూ ఈ సమస్యపై మీరు ఎటువంటి చ్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని ఆమె పరోక్షంగా తెలిపారు.

కాల్ సరిగా కనెక్ట్ కాక..
వినియోగదారులు ఓ నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్కు కాల్ చేయాలంటే ప్రధానంగా ఎదుర్కునే సమస్య కాల్ డ్రాప్ సమస్య. కాల్ సరిగా కనెక్ట్ కాక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనే కేంద్రం సీరియస్ గా స్పందించింది.

టెలికాం శాఖ (డాట్) సెక్రటరీ అరుణ సుందరరాజన్
మొబైల్ టవర్ల ఏర్పాటులో ఇబ్బందులున్నాయనో లేక మరొకటో సాకులు చెప్పొద్దని తెగసి చెప్పింది. కేంద్రం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నది టెలికాం శాఖ (డాట్) సెక్రటరీ అరుణ సుందరరాజన్ అన్నారు.

ఇలాగే కొనసాగడానికి వీల్లేదని..
డ్రాప్స్ సమస్య ఇలాగే కొనసాగడానికి వీల్లేదని దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పదని, ఈ విషయం పరిశ్రమకు స్పష్టం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె తెలిపారు.

జనవరి 21 న ట్రాయ్ నివేదిక
కాల్ డ్రాప్ ఫార్ములా ఆధారిత మొబైల్ సేవల నాణ్యతపై జనవరి 21 న టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక అందగానే పరిశ్రమ వర్గాలతో డాట్ భేటీ కానున్నట్లు అరుణ వెల్లడించింది. ప్రజల వ్యతిరేకత కారణంగా మొబైల్ ఆపరేటర్లు కొన్ని చోట్ల టవర్ల ఏర్పాటులో సమస్యలు ఎదుర్కోవటానికి నిజమే అయినా ... కాల్ డ్రాప్స్కి అది సాకుగా చూపరాదని అరుణ స్పష్టంచేసింది.

మొబైల్ కాల్స్ అంతరాయాలను ..
మొబైల్ కాల్స్ అంతరాయాలను నిరోధించేలా ట్రాయ్ తెచ్చిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చాయి. ఆ తరువాత తొలిసారిగా డిసెంబరు త్రైమాసిక పరిణామాలపై ట్రాయ్ త్వరలో నివేదిక ఇవ్వనుంది. కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ టవర్ల స్థాయిలో కాల్స్ నాణ్యతను పరిశీలించనున్నారు.

రూ .10 లక్షల దాకా జరిమానా..
ప్రమాణాలు పాటించకపోతే టెల్కోల పై గరిష్టంగా రూ .10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. ఈ సమస్యను అధిగమించేందుకు అలాగే టెల్కోలు తమ ఇనప్రాస్ట్రక్చర్ ని మెరుగుపరుచుకునేందుకు మరింతగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470