ప్రపంచమంతా ఇంటర్నెట్ బంద్!
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న నేపధ్యంలో ఆయా రంగాల్లో చోటు చేసేకోబోయే ఆధునిక డెవలప్మెంట్స్కు సంబంధించి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో సహా రిసెర్చర్స్ తమతమ అంచనాలను వెల్లిబుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ కమ్యూనిటీకి సంబంధించిన ఓ సెక్యూరిటీ నిపుణుడు మాత్రం షాకిచ్చే న్యూస్తో వార్తలో నిలిచారు.
Read More : 2017లో రాబోతున్న స్మార్ట్ఫోన్లు ఇవే..?

LogRhtyhm అంచనా..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతున్న అంతర్జాలం 2017లో 24 గంటల పాటు స్తంభించిబోయే అవకాశముందని అమెరికన్ సెక్యూరిటీ టెక్నాలజీ కంపెనీ LogRhtyhm అంచనా వేస్తోంది. ప్రపంచంలో ఏ ఒక్కరు యాక్సిస్ చేసుకోలేని విధంగా ఇంటర్నెట్ను హ్యాకర్లు దెబ్బతీసే అవకాశముందని సెక్యూరిటీ నిపుణుడు జేమ్స్ కార్డర్ అంచనా వేసారు.

ప్రపంచదేశాలు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతున్నాయ్..
ఇంటర్నెట్ మనిషి జీవన విదివిధానాలను పూర్తి మార్చేసింది. భారత్ వంటి అభివృద్థి చెందుతున్న దేశాలు ఇంటర్నెట్ పై అత్యధిక శాతం ఆధారపడ్డాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంటర్నెట్ సేవలు ఇప్పటికిప్పుడు నిలిచిపోవటం కారణంగా అనేక సంక్షోభాలు తలెత్తే అవకాశముంది.

ఇంటర్నెట్ సేవలు ఇప్పటికిప్పుడు నిలిచిపోతే
సగానికి పైగా ఇండియా నిరుద్యోగులతో నిండిపోతుంది. ఎందుకంటే, ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే బిగ్ షాట్ కంపెనీలన్నీ మూతపడతాయి కాబట్టి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతే కొన్ని ప్రశ్నలకు సమాధానాలే దొరకవు.

ఇంటర్నెట్ సేవలు ఇప్పటికిప్పుడు నిలిచిపోతే
ఎటువంటి యాప్స్ మీ ఫోన్లలో పనిచేయవు. మీ సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనేవారంటూ ఉండరు

ఇంటర్నెట్ సేవలు ఇప్పటికిప్పుడు నిలిచిపోతే
సెల్ఫీ ట్రెండ్ పూర్తిగా అంతరించిపోతుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేదే ఉండదు.

ఇంటర్నెట్ సేవలు ఇప్పటికిప్పుడు నిలిచిపోతే
తత్కాల్ కౌంటర్లలో క్యూల సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది. పాస్పోర్ట్ జారీ ప్రక్రియ మరింత మందకొడిగా సాగుతుంది.

ఇంటర్నెట్ సేవలు ఇప్పటికిప్పుడు నిలిచిపోతే
సోషల్ మీడియా వెబ్సైట్లంటూ మనకు కనిపించవు. మీకు వర్చువల్ ఫ్రెండ్స్ అనే వారే ఈ లోకంలో ఉండరు. ఆన్లైన్ షాపింగ్ పూర్తిగా మూతపడిపోతుంది.


Click it and Unblock the Notifications








