ఆ వైరస్తో ‘నో ప్రోబ్లమ్’!

జూలై9న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు ముప్పువాటిల్లనుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దింతో నెటిజనులు ఆందోళనకు గురైనప్పటికి కంప్యూటర్లపై దాడికి పాల్పడిన డీఎన్ఎస్ చేంజర్ వైరస్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ప్రమాదకర వైరస్ కారణంగా సోమవారం భారత్ సహా పలు దేశాల్లో వేలాది కంప్యూర్లుకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని తొలత భావించారు. అయితే ఈ మాల్ వేర్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ముందుజాగ్రత్తలు తీసుకోవడం, కంప్యూటర్ల నుంచి వైరస్ను తొలగించాలని కస్టమర్లకు సూచించడంతో నెట్ సంబంధాలు తెగిపోలేదని సైబర్ సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి. దింతో ఇంటర్నెట్ సేవలు యదావిధిగా కొనసాగాయి.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








