Jio టెల్కోకు మరో ఎదురుదెబ్బ!! 11 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది...
ఇండియాలోని టెలికాం రంగంలో అతి తక్కువ కాలంలో అగ్రస్థానంలోకి ఎదిగిన రిలయన్స్ జియో సంస్థ ప్రారంభం నుంచి సబ్స్క్రైబర్లను జోడించుకుంటూ అధిక మందిని కలిగి ఉంది. అయితే ఈ సంవత్సరంలో మాత్రం కొన్ని ఎదురుదెబ్బలను ఎదురుకుంటున్నది. సబ్స్క్రైబర్ల జోడింపు పరంగా జియో 2021 రెండవ త్రైమాసికంలో (FY22) కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ ఈ టెల్కో ఇప్పటికీ ఇండియాలో అతిపెద్ద సబ్స్క్రైబర్ మార్కెట్ వాటాను కలిగి ఉంది.

2021 FY22 రెండవ త్రైమాసికంలో జియో సుమారు 11 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఇప్పుడు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నుండి నెలవారీ పనితీరు నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2021లో Jio 19 మిలియన్ల వినియోగదారులను కోల్పోయింది. దీని వలన టెల్కో యొక్క మొత్తం సబ్స్క్రైబర్ బేస్ 424.83 మిలియన్లకు చేరుకుంది. అయితే అదే సమయంలో భారతీ ఎయిర్టెల్ 0.27 మిలియన్ల వైర్లెస్ కస్టమర్లను జోడించింది. అలాగే Vodafone Idea (Vi) కూడా మరో 1.07 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. దీని వలన దాని సబ్స్క్రైబర్ బేస్ 269.99 మిలియన్లకు తగ్గింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

త్రైమాసికంలో జియో ARPU పెరుగుదల
యూజర్ బేస్ నుండి తక్కువ-చెల్లించే ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్లను క్లీన్-అప్ చేయడం ద్వారా జియోకు దాని సగటు ఆదాయాన్ని ప్రతి వినియోగదారు (ARPU) సంఖ్యను మెరుగుపరచడంలో సహాయపడింది. జూన్ త్రైమాసికంలో జియో సగటు ARPU రూ.138 నుండి రూ.144కి పెరిగింది. భారతీ ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా సెప్టెంబర్లో తమ సబ్స్క్రైబర్ మార్కెట్ వాటాను విస్తరించాయి. ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ మార్కెట్ వాటా 29.85% నుండి 30.4%కి చేరుకోగా, వొడాఫోన్ ఐడియా గణాంకాలు 22.84% నుండి 23.15%కి మెరుగుపడ్డాయి. అదే సమయంలో రిలయన్స్ జియో సబ్స్క్రైబర్ మార్కెట్ వాటా 37.40% నుండి 36.43%కి క్షీణించింది.

జియో టెల్కో యొక్క ARPU పెరుగుతున్నందున ఇది జియో చింతించాల్సిన విషయం కాదు. అంతేకాకుండా ఇది ఇప్పటికీ చాలా ఎక్కువ మార్జిన్తో అతిపెద్ద సబ్స్క్రైబర్ మార్కెట్ వాటాను కలిగి ఉంది. ARPUతో పాటు జియో యొక్క యాక్టివ్ సబ్స్క్రైబర్ బేస్ ఫిగర్ కూడా మెరుగుపడింది. సెప్టెంబరులో అత్యధికంగా 97.86% శాతం క్రియాశీల వినియోగదారులను కలిగి ఉన్న టెల్కోగా భారతీ ఎయిర్టెల్ తన స్థానాన్ని నిలుపుకుంది. జియో మరియు వోడాఫోన్ ఐడియా వారి మొత్తం వినియోగదారులలో 83.65% మరియు 87.31% క్రియాశీల సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నాయి.

డిసెంబర్ త్రైమాసికంలో టారిఫ్ పెంపుదల మొదలవుతున్నందున టెల్కోలకు మరింత మెరుగ్గా ఉండాలి. Reliance Jio మొత్తం యూజర్ బేస్ నుండి దాని నిష్క్రియ సబ్స్క్రయిబర్లలో మరికొంత మందిని తొలగించాలని చూస్తోంది. ఇది టెల్కో యొక్క ARPUని మళ్లీ అధికం చేస్తుంది. భారతదేశంలో అత్యధికంగా 4G సబ్స్క్రైబర్లను జియో కలిగి ఉండటం గమనించదగ్గ విషయం. ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్ బేస్ను క్లీన్ చేయడం అనేది ముందు ముందు దీర్ఘకాలంలో కంపెనీకి మేలు చేస్తుంది. ఈ త్రైమాసికంలో సబ్స్క్రైబర్లు తగ్గినప్పటికీ టెల్కో తన యాక్టివ్గా ఉన్న వాటి నుండి ఎక్కువ సంపాదిస్తోంది. వోడాఫోన్ ఐడియా మరియు భారతీ ఎయిర్టెల్తో పోలిస్తే జియో ఇప్పటికీ మెరుగైన యాక్టివ్ సబ్స్క్రైబర్ శాతాన్ని కలిగి ఉంది. కానీ జియోకి పని చేసే ఒక విషయం ఏమిటంటే ఇది 4G కంపెనీ మాత్రమే. అంటే యాక్టివ్గా ఉన్న కస్టమర్లందరూ వారు తక్కువగా ఉన్నప్పటికీ 4G సేవలను వినియోగిస్తున్నారు. ARPU కూడా పెరగడంతో ఇది Jioకి మెరుగైన ఆదాయాన్ని అందిస్తుంది.


Click it and Unblock the Notifications