లైన్ క్లియర్..?

ప్రపంచపు చవక టాబ్లెట్ కంప్యూటర్ ఆకాష్ పై ముసురుకున్న వివాదాలు ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ డివైజ్ల తయారీ సంస్థ డేటావిండ్, యూబీస్లేట్ 7+, యూబీస్లేట్ 7C విడుదలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి వీటిని త్వరలోనే డెలివరీ చెయునున్నారు. 7 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన ఈ ఆండ్రాయిడ్ ఆధారిత పీసీల ధరలను ఇండియాలో రూ. 2,900, 3,999గా ప్రకటించారు. రిటైలింగ్ అమ్మకాలు మరికొద్ది రోజల్లో ప్రారంభం కానున్నాయి.
యూబీస్లేట్ 7సీ ఫీచర్లు:
7 అంగుళాల మల్టీటచ్ స్ర్కీన్ రిసల్యూషన్ (800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
800 మెగాహెడ్జ్ ఆర్మ్కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
3200 mAh బ్యాటరీ (వాడుక సమయం 180 నిమిషాలు),
4జీబి ఇంటర్నల్ ఫ్లాష్ మెమెరీ,
వై-ఫై కనెక్టువిటీ,
జీఎస్ఎమ్ నెట్వర్క్ సపోర్ట్,
మైక్రో యూఎస్బీ స్లాట్స్.
యూబీస్లేట్ 7+ ఫీచర్లు:
7 అంగుళాల మల్టీటచ్ స్ర్కీన్ రిసల్యూషన్ (800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
800 మెగాహెడ్జ్ ఆర్మ్కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
3200 mAh బ్యాటరీ (వాడుక సమయం 180 నిమిషాలు),
2జీబి ఇంటర్నల్ ఫ్లాష్ మెమెరీ,
వై-ఫై కనెక్టువిటీ,
జీఎస్ఎమ్ నెట్వర్క్ సపోర్ట్,
మైక్రో యూఎస్బీ స్లాట్స్.


Click it and Unblock the Notifications