Just In
- 10 hrs ago Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- 11 hrs ago 42.5 గంటల ప్లేబ్యాక్ టైం కలిగిన నథింగ్ ఇయర్(a) సేల్.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!
- 12 hrs ago ధర రూ.1099 కే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, SOS ఫీచర్ కలిగిన బోట్ స్మార్ట్వాచ్ విడుదల.. సేల్ వివరాలు..!
- 14 hrs ago స్మార్ట్ఫోన్ను పోగొట్టుకున్నారా... Find My Device ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకోండి..!!
Don't Miss
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- Movies Karthika Deepam 2 April 23th: దీప నుంచి కూపీలాగుతున్న సుమిత్ర.. టెన్షన్లో పారిజాతం
- News కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
Airtelకు యూఐడీఏఐ నుంచి భారీ షాక్ , విచారణకు ఆదేశాలు
దేశీయ టెలికం సంస్థల్లో అతిపెద్దదైన భారతీ ఎయిర్టెల్కు యూఐడీఏఐ గట్టి షాక్ ఇచ్చింది.
దేశీయ టెలికం సంస్థల్లో అతిపెద్దదైన భారతీ ఎయిర్టెల్కు యూఐడీఏఐ గట్టి షాక్ ఇచ్చింది. మొబైల్ వినియోగదారులతో పాటు పేమెంట్స్ బ్యాంకు ఖాతాదారుల ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్)ని ఎయిర్టెల్ దుర్వినియోగం చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సిమ్ కార్డులు, బ్యాంకు క్లయింట్లకు ఆధార్తో లింక్ అయ్యే ఈ-కేవైసీ వెరిఫికేషన్ను చేపట్టకుండా భారతీ ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది.
జియో రూ. 52 ప్లాన్కి రూ 49తో షాకిచ్చిన ఎయిర్టెల్
సబ్స్క్రైబర్లకు తెలియకుండా..
సిమ్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆధారితంగా ఆధార్-కేవైసీని ఉపయోగించి సబ్స్క్రైబర్లకు తెలియకుండా భారతీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు అకౌంట్లను ప్రారంభిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో యూఐడీఏఐ ఈ చర్యలు తీసుకుంది.
వారికి తెలియకుండానే ఆధార్ నెంబర్ల సహాయంతో..
కాగా మొబైల్ నెంబర్కు ఆధార్ లింకింగ్ కోసం వచ్చిన ఎయిర్టెల్ ఖాతాదారుల రిక్వెస్ట్లను వారికి తెలియకుండానే ఆధార్ నెంబర్ల సహాయంతో పేమెంట్ అకౌంట్లని సృష్టించింది.
సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ..
అలా సృష్టించడమే కాకుండా సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసినప్పుడు వినియోగదారునికి అందాల్సిన సబ్సిడీని ఎయిర్ టెల్ పేమెంట్ ఖాతాలో చేరేలా చేసింది.
ఖాతాల్లో పడేలా..
వాస్తవానికి ఎయిర్టెల్ ఖాతాదారులు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని ఇతర బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసినా.. ఆ ఖాతాలకు కాకుండా సబ్సిడీ మొత్తం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతాల్లో పడేలా అక్రమాలకు పాల్పడింది.
గత కొన్ని నెలలుగా
గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ప్రక్రియపై.. గ్యాస్ సబ్సిడీ ఎయిర్టెల్ అకౌంట్లకు మళ్లడంపై ఎయిర్టెల్ యూజర్లు యూఐడీఏఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదుపై స్పందించిన ఆ సంస్థ ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుపై ఎయిర్టెల్పై విచారణకు ఆదేశించింది.
ఈ-కేవైసీ వెరిఫికేషన్ను చేపట్టకుండా
ప్రస్తుతం ఆధార్ ఈ-కేవైసీ వెరిఫికేషన్ను చేపట్టకుండా భారతీ ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుపై యూఐడీఏఐ చర్యలు తీసుకుంది.
ఎయిర్టెల్పై విచారణకు ఆదేశిస్తున్నామని..
ఈ వ్యవహారంలో ఎయిర్టెల్పై విచారణకు ఆదేశిస్తున్నామని, విచారణ నివేదిక అందిన తర్వాత ఎయిర్టెల్ ఈ-కేవైసీ లైసెన్సుపై సస్పెన్షన్ ఎత్తివేయడం గానీ, తదుపరి చర్యలు చేపట్టడం గానీ చేస్తామని యూఐడీఏఐ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఎయిర్టెల్ను సంప్రదించగా
ఈ విషయమై ఎయిర్టెల్ను సంప్రదించగా.. యూఐడీఏఐ నుంచి తాత్కాలిక ఉత్తర్వు అందినట్లు ధ్రువీకరించింది. దీనిపై అధికారులను సంప్రదిస్తున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470