జూన్ 6 న ఇండియాలో లాంచ్ కానున్న,Vivo X Fold 3 Pro ! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
Vivo సంస్థ భారతదేశంలో తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ Vivo Fold 3 Pro ని జూన్ 6న లాంచ్ ఈవెంట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 SoC ద్వారా పనిచేస్తుంది మరియు సెకండరీ V3 చిప్తో జత చేయబడిందని నిర్ధారించబడింది. ఈ ఫోల్డబుల్ పరికరం 5,700mAh బ్యాటరీ, ZEISS కెమెరా ఆప్టిక్స్ మరియు గూగుల్ యొక్క జెమిని AI ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు.
Vivo X Fold 3 Pro ధర:
వివో X ఫోల్డ్ 3 ప్రో మార్చిలో చైనాలో 9,999 యువాన్ల ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. ఇది దాదాపు ₹1.17 లక్షలకు సమానం. అయితే, భారతీయ మార్కెట్లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో తెలియాలంటే వివో సంస్థ నుండి అధికారిక ధర ప్రకటన కోసం మనం వేచి ఉండాల్సిందే.

Vivo X ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్ల వివరాలు :
వివో X ఫోల్డ్ 3 ప్రో (చైనా వేరియంట్) 2200 x 2480 పిక్సెల్ల రిజల్యూషన్, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్ల గరిష్ట ప్రకాశంతో 8.03-అంగుళాల LTPO అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. అదే సమయంలో, ఈ ఫోన్ 1172 x 2748 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.53-అంగుళాల అమోలెడ్ బయటి డిస్ప్లేను కూడా కలిగి ఉంది.
ఈ స్మార్ట్ఫోన్ 4nm ప్రాసెసర్ ఆధారంగా సరికొత్త క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది మరియు ఇది అన్ని గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్లను నిర్వహించడానికి అడ్రెనో 750 GPU తో జత చేయబడింది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే, ఈ ఫోన్ గరిష్టంగా 16GB LPDDR5X RAM మరియు 1TB వరకు UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది.
ఇక కెమెరా ఆప్టిక్స్ పరంగా వివరాలు గమనిస్తే, వివో X ఫోల్డ్ 3 ప్రో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 3x ఆప్టికల్ జూమ్తో కూడిన 64MP టెలిఫోటో లెన్స్తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది. ఈ ఫోన్ 100W ఫ్లాష్ ఛార్జింగ్ మరియు 50W వైర్లెస్ ఛార్జింగ్తో కూడిన భారీ 5,700mAh బ్యాటరీతో వస్తుంది.
ఈ ఫోన్ ఇప్పటికే చైనా లో లాంచ్ అయినందున పూర్తి స్పెసిఫికేషన్లను మనము తెలుసుకోవచ్చు. ఇండియాలో లాంచ్ అయ్యే వేరియంట్ కూడా అదే రకమైన స్పెసిఫికేషన్లు కలిగి ఉంటాయని తెలుస్తోంది.
గిజ్బాట్ తెలుగు వెబ్సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








