వొడాఫోన్ ఐడియా(Vi) టెల్కో టారిఫ్ పెంపును ప్రకటించనున్నది!!

|

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో మూడవ అతిపెద్ద ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా (Vi) 2022 చివరి నాటికి మరొకసారి టారిఫ్ పెంపును ప్రకటించనున్నది. వొడాఫోన్ ఐడియా యొక్క ప్రస్తుత CEO రవీందర్ టక్కర్ త్వరలోనే VIL బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 5G ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొనిరావాలని ప్రయత్నాలను చేస్తున్న సమయంలో టారిఫ్ పెంపునకు సరైన సమయం అని పెట్టుబడిదారులకు పిలుపును కూడా అందించినట్లు సమాచారం. దీనితో పాటు 5G ప్లాన్‌లను ఖచ్చితంగా 4G కంటే ప్రీమియంతో అందించాలని టక్కర్ చెప్పారు. అయితే టారిఫ్ పెంపు యొక్క నిర్దిష్ట తేదీ ఏదీ ఇవ్వనప్పటికీ 2022 సంవత్సరం ముగిసేలోపు ధరల పెంపు లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi ఎప్పుడు టారిఫ్ పెంపును అమలు చేస్తుంది?

Vi ఎప్పుడు టారిఫ్ పెంపును అమలు చేస్తుంది?

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల యొక్క పెట్టుబడిదారులకు లేదా వినియోగదారులకు టారిఫ్ పెంపు అనేది ఆశ్చర్యం కలిగించకూడదు ఎందుకంటే ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) రెండూ చాలా కాలంగా తమ యొక్క మనుగడను కాపాడుకోవడం కోసం టారిఫ్ పెంపు గురించి చెబుతున్నాయి. ముఖ్యంగా 5G స్పెక్ట్రమ్ వేలం సమయంలో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి 5G ఎయిర్ వేలను కొనుగోలు చేయడంతో ఇప్పుడు టారిఫ్ ధరల పెంపు అనేది అనివార్యమైంది. వోడాఫోన్ ఐడియా (Vi) ముందునుంచి కూడా నష్టాలను చవిచూస్తూనే ఉండడంతో దాని యొక్క పెట్టుబడిదారులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోతున్నది. ఆదాయాన్ని పెంచుకోవడానికి టెల్కోకు టారిఫ్‌ల పెంపు అవసరం. ప్రస్తుతం Vi 4G సబ్‌స్క్రైబర్‌లను జోడిస్తోంది మరియు టారిఫ్ పెంపుతో రాబోయే త్రైమాసికాల్లో దాని మొత్తం ఆదాయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Vi

వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో యొక్క ప్రతి వినియోగదారుల సగటు ఆదాయం (ARPU) సంఖ్య ఇప్పటికీ ఎయిర్టెల్ మరియు జియో సంస్థలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. టారిఫ్‌ల పెంపుతో పాటు భారత్‌లో 5G రాకతో డేటా వినియోగం పెరుగుతుందని టక్కర్ తెలిపారు. జియో మరియు ఎయిర్టెల్ సంస్థలు రెండూ కూడా 5G యొక్క వేగవంతమైన రోల్ అవుట్ గురించి ఇప్పటికే కొన్ని ప్రకటనలను చేసినప్పటికీ Vi మాత్రం ఇప్పటి వరకు అటువంటి ప్రకటనలను ఏవి కూడా చేయలేదు.

DoT

వొడాఫోన్ ఐడియా (Vi) టెల్కో గత కొన్ని సంవత్సరాలలో గణనీయమైన మూలధనాన్ని సేకరించడంలో విఫలమైంది మరియు ఇప్పుడు దానికంటే ముందు లిక్విడిటీ ఆందోళనలను కూడా కలిగి ఉంది. DoT (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) టెల్కోలకు రిలీఫ్ ప్యాకేజీతో ఎక్కువగా సహాయం చేసినప్పటికీ Vi కి ఇది ఇంకా సరిపోలేదు. కంపెనీలో ప్రభుత్వం తన సంబంధిత వాటాను కేటాయించిన తర్వాత మాత్రమే పెట్టుబడిదారులు టెల్కోకు డబ్బు ఇస్తారని Vi మేనేజ్‌మెంట్ భావించడం గమనించదగ్గ విషయం.

5G స్పెక్ట్రమ్ వేలంలో ప్రైవేట్ టెల్కోలు చేసిన డిపాజిట్ మొత్తం

5G స్పెక్ట్రమ్ వేలంలో ప్రైవేట్ టెల్కోలు చేసిన డిపాజిట్ మొత్తం

5G స్పెక్ట్రమ్ వేలం రేసులో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరియు అదానీ గ్రూప్ వంటి నలుగురు పెద్ద ఆటగాళ్లు ఉన్నారు. ఈ నలుగురూ కలిసి రూ.21,400 కోట్ల కోర్‌ను సీరియస్ మనీ డిపాజిట్ (EMD)లో సమర్పించారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 14,000 EMDని సమర్పించగా, భారతీ ఎయిర్‌టెల్ రూ. 5,500 కోట్ల EMDని సమర్పించింది. నగదు కొరతతో ఉన్న వోడాఫోన్ ఐడియా (Vi) తన ప్రాధాన్యత మార్కెట్‌లలో 5G ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేస్తుందని సూచిస్తూ రూ. 2,200 కోట్లను అర్జెంట్ డబ్బుగా సమర్పించింది. 4G స్పెక్ట్రమ్ కోసం 2021 వేలంలో రిలయన్స్ జియో వారి డిపాజిట్‌లో 77.9 శాతాన్ని ఉపయోగించగా, ఎయిర్‌టెల్ 87.7 శాతాన్ని ఉపయోగించింది. కానీ నిజం చెప్పాలంటే ఎక్కువ డబ్బు కూడా జియో వద్ద ఉంది. ఎయిర్‌టెల్ లాభదాయకంగా ఉండగలిగింది మరియు వ్యాపార కొలమానాలను మెరుగుపరుస్తుంది. అయితే జియో తన నెట్‌వర్క్‌లలో పెట్టుబడి పెట్టగల డబ్బును ఇప్పటికీ అక్కడ పెట్టుబడి పెట్టలేదు. Vodafone Idea (Vi) విలీనం అయినప్పటి నుండి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు మరియు అది 5G స్పెక్ట్రమ్ వేలంలో పెద్దగా పెట్టుబడి పెట్టకపోవడానికి కారణం దాని వద్ద గల డబ్బు కొరత కూడా కారణం.

టెలికాం సంస్థలు అన్ని పొందిన స్పెక్ట్రమ్ మొత్తం:

టెలికాం సంస్థలు అన్ని పొందిన స్పెక్ట్రమ్ మొత్తం:

ఎయిర్‌టెల్: 19,867.8 MHz - రూ. 43,084 కోట్లు

జియో: 24,740 MHz - రూ. 88,078 కోట్లు

వోడాఫోన్ ఐడియా: 6228.4 MHz - రూ. 18,799 కోట్లు

అదానీ: 400 MHz - రూ. 212 కోట్లు

600 MHz బ్యాండ్ మొదటిసారి వేలం వేయబడింది. కానీ టెల్కోలు అన్ని కూడా దీనిని కొనుగోలు చేయడం కోసం ఎటువంటి ఆసక్తిని కనబరచలేదు. అయితే 600 MHzలో 10 MHz స్పెక్ట్రమ్ మాత్రం 5G సేవల కోసం BSNL/MTNL కోసం రిజర్వ్ చేయబడింది. 700 MHz బ్యాండ్‌లో 10 MHz స్పెక్ట్రమ్‌ని పొందిన ఏకైక టెల్కో జియో మాత్రమే . ఎయిర్‌టెల్ టెల్కో 900 MHz బ్యాండ్‌లోని మూడు సర్కిల్‌లలో కొంత స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉంచింది. 1 GHz బ్యాండ్‌లలో వోడాఫోన్ ఐడియా భాగస్వామ్యం కలిగిలేదు. ఎయిర్‌టెల్ తన స్పెక్ట్రమ్ హోల్డింగ్‌లను పటిష్టం చేయడానికి 1800 MHz మరియు 2100 MHz బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ జియో టెలికాం సంస్థ తన హోల్డింగ్‌లను పెంచుకోవడానికి కేవలం 1800 MHz బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. వోడాఫోన్ ఐడియా కూడా 1800 MHz, 2100 MHz మరియు 2500 MHz బ్యాండ్‌లలో మాత్రమే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. కానీ హై బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను గెలుచుకోవడంలో ఎయిర్‌టెల్ మరియు జియో సంస్థలు రెండూ కూడా దూకుడుగా పాల్గొన్నాయి. వోడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్‌ను అధిక బ్యాండ్‌లలో దాని ప్రాధాన్యత గల సర్కిల్‌లలో మాత్రమే కొనుగోలు చేసింది.

 

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Telco Will Try to Tariff Hikes by The End of Year 2022

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X