మరో ప్లాన్ ను ప్రవెశపెట్టిన వోడాఫోన్..యూజర్లకు ఎక్కువ రోజులు వాలిడిటీ ఇవ్వడమే టార్గెట్
దేశీయ టెలికాం రంగం రోజురోజుకు పెను విప్లవాల వైపుగా దూసుకుపోతోంది. జియో రాకతో పోటీవాతావరణం వేడెక్కిన విషయం అందరికీ తెలిసిందే.
దేశీయ టెలికాం రంగం రోజురోజుకు పెను విప్లవాల వైపుగా దూసుకుపోతోంది. జియో రాకతో పోటీవాతావరణం వేడెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియోని ఢీకొట్టడమే లక్ష్యంగా మిగతా టెల్కోలు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులు తమ నుంచి చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి.ఇప్పటికే ఎయిర్టెల్ మరియు BSNL సరికొత్త ప్లాన్స్ ను విడుదల చేయగా వోడాఫోన్ కూడా మరో సరికొత్త ప్లాన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. మూడు రోజుల క్రితం యూజర్లకు అధిక వాలిడిటీ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం తో రూ. 279 ప్లాన్ ను విడుదల చేయగా ఈ రోజు రూ. 189 ప్లాన్ ను విడుదల చేసింది.

రూ.189 ప్లాన్
ప్రీపెయిడ్ కస్టమర్లకోసం 189 రూపాయల రీఛార్జ్ ప్యాక్ను లాంచ్ చేసింది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్కాల్స్,వారనికి 4జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్లు అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు.

రూ. 279 ప్లాన్
ప్రీపెయిడ్ కస్టమర్లకోసం 279 రూపాయల రీఛార్జ్ ప్యాక్ను లాంచ్ చేసింది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్కాల్స్,వారనికి 4జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్లు అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.

వోడాఫోన్ రూ.189 ప్లాన్ vs జియో
జియో అందిస్తున్న రూ.198 ప్లాన్ కి చెక్ పెడుతు వోడాఫోన్ రూ.189 ప్లాన్ ను విడుదల చేసింది . జియో రూ.198 తో 28 రోజులు వాలిడిటీ ఇవ్వగా వోడాఫోన్ రూ.189 కే 56 రోజుల వాలిడిటీ ని ఇస్తుంది

వోడాఫోన్ రూ.189 ప్లాన్ vs ఎయిర్టెల్
ఎయిర్టెల్ కొత్తగా రూ. 159 ను ప్లాన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో వినియోగదారుడికి అన్లిమిటెడ్ వాయిస్కాల్స్ తో పాటు రోజుకి 1 జీబీ డేటా లబిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 21 రోజులు మాత్రమే .


Click it and Unblock the Notifications







