మరో ఆఫర్తో దూసుకొచ్చిన వొడాఫోన్
వొడాఫోన్ ఢిల్లీ-ఎన్సీఆర్ సర్కిల్లోని ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త రీఛార్జ్ ప్యాక్ను లాంచ్ చేసింది. రూ. 199తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ఉచిత కాల్స్, 1జీబీ డేటా లభిస్తాయి.
వొడాఫోన్ ఢిల్లీ-ఎన్సీఆర్ సర్కిల్లోని ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త రీఛార్జ్ ప్యాక్ను లాంచ్ చేసింది. రూ. 199తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ఉచిత కాల్స్, 1జీబీ డేటా లభిస్తాయి. అయితే రోజుకు గరిష్టంగా 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలను మాత్రమే ఉచిత కాల్స్ను వినియోగించుకోవచ్చు.

ఒకవేళ ఈ పరిమితి మించితే నిమిషానికి 30 పైసలను చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు నియమ, నిబంధనల ప్రకారం ఏడు రోజుల వ్యవధిలో 300పైగా యూనిక్ నెంబర్లకు కాల్స్ చేసుకోవడానికి వీలులేదు. 300 నెంబర్ల మార్కు దాటినా నిమిషానికి 30 పైసలు చెల్లించాల్సిందే.


Click it and Unblock the Notifications








