భారీ ఆఫర్లతో సంచలనం రేపుతున్న వొడాఫోన్ రూ. 399 ప్లాన్
భారీ ఆఫర్లతో సంచలనం రేపుతున్న వొడాఫోన్ రూ. 399 ప్లాన్, 30 జిబి డేటా, 4000 వేల సినిమాలు, 3500 ఈ - మ్యాగజైన్లు
దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజు రోజుకు వేడెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా జియో అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లతో దూసుకురాగా, ఎయిర్టెల్ తన ప్లాన్లను రివిజన్ చేసి వినియోగదారులను చేజారిపోకుండా కాపాడుకుంటోంది. ఈ నేపధ్యంలో వొడాఫోన్ కూడా ఓ అడుగుముందుకేసి సరికొత్త ఆఫర్లతో దూసుకొచ్చింది.

నెలకు 30జీబీ 3జీ/4జీ డేటా..
వొడాఫోన్ ఇండియా తన పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్ల కొత్త రెడ్ ప్లాన్ను వొడాఫోన్ అప్డేట్ చేసింది. ఈ కొత్త వొడాఫోన్ ప్లాన్ రూ.399 కింద నెలకు 30జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్, 100 ఎస్ఎంఎస్లు కస్టమర్లకు లభించనున్నాయి.

రూ.4000 విలువైన మూవీలు
వొడాఫోన్ ప్లే సర్వీసు ద్వారా రూ.4000 విలువైన మూవీలకు ఉచిత యాక్సస్ లభించనుంది. నాలుగు నెలల పాటు 3500 ఈ-మ్యాగజైన్లను చదువుకునేలా మ్యాగ్జటర్ సబ్స్క్రిప్షన్ను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది.

రోజుకు 250 నిమిషాలు..
ఇతర ప్లాన్స్ మాదిరిగానే కొత్త రూ.399 వొడాఫోన్ రెడ్ప్లాన్ అపరిమిత కాల్స్లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవాలి.

199కి కాల్..
తొలుత వొడాఫోన్ రెడ్ సబ్స్క్రైబర్లు రూ.399 ప్లాన్ను పొందడానికి తమ మొబైల్ హ్యాండ్సెట్ల నుంచి 199కి కాల్ చేయాల్సి ఉండేది. అయితే అధికారిక వొడాఫోన్ సైట్ మాత్రం ఈ కొత్త ప్లాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంది. ప్రస్తుత ప్లాన్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, జమ్ము అండ్ కశ్మీర్, హిమాచల్ప్రదేశ్ సర్కిళ్లలో అందుబాటులో లేదు.

గతేడాది నవంబర్లో..
గతేడాది నవంబర్లో వొడాఫోన్ తన పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్లకు ఈ రూ.399ల రెడ్ బేసిక్ ప్లాన్ను లాంచ్ చేసింది. అప్పుడు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్పై ఉచిత ఇన్కమింగ్, 10జీబీ డేటాను ఆఫర్ చేసేంది. ఎలాంటి అదనపు ప్రయోజనాలను అందించలేదు.

అనంతరం ఈ ప్లాన్ను..
అనంతరం ఈ ప్లాన్ను అప్గ్రేడ్ చేసి డేటా పరిమితిని 20జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ డేటాను మరో 10జీబీ పెంచి, 30జీబీ చేసింది. జియో తన రూ.309 పోస్టు పెయిడ్ప్లాన్పై 30జీబీ డేటాను, ఎయిర్టెల్ తన రూ.399 మైఇన్ఫినిటీ పోస్టుపెయిడ్ ప్లాన్పై 20జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి.

మళ్లీ అదిరే ఆఫర్లతో దూసుకొచ్చిన జియో, ఈ సారి గడువు పరిమితి !
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో వరుసగా నాలుగో సారి పంజా విసిరింది. దిగ్గజాలకు ధీటుగా మళ్లీ భారీ క్యాష్బ్యాక్ ఆఫర్లతో దూసుకొచ్చింది. అయితే తన కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న క్యాష్బ్యాక్ ఆఫర్లు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదుని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా తన ప్రైమ్ కస్టమర్లకు మరో క్యాష్బ్యాక్ ఆఫర్ను జియో ప్రకటించింది.రూ.398, ఆపై మొత్తాల రీఛార్జ్లకు ఈ కొత్త జియో ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

కస్టమర్లకు రూ.799 వరకు ప్రయోజనాలను ..
ఈ ఆఫర్ కింద కస్టమర్లకు రూ.799 వరకు ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. రీఛార్జ్ ఓచర్లు, వాలెట్ క్యాష్బ్యాక్ల రూపంలో ఈ ప్రయోజనాలు కస్టమర్లకు అందనున్నాయి.

గతేడాది నవంబర్లో.
గతేడాది నవంబర్లో.. గతేడాది నవంబర్లో వొడాఫోన్ తన పోస్టు పెయిడ్ సబ్స్క్రైబర్లకు ఈ రూ.399ల రెడ్ బేసిక్ ప్లాన్ను లాంచ్ చేసింది. అప్పుడు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్పై ఉచిత ఇన్కమింగ్, 10జీబీ డేటాను ఆఫర్ చేసేంది. ఎలాంటి అదనపు ప్రయోజనాలను అందించలేదు.

అనంతరం ఈ ప్లాన్ను..
అనంతరం ఈ ప్లాన్ను అప్గ్రేడ్ చేసి డేటా పరిమితిని 20జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ డేటాను మరో 10జీబీ పెంచి, 30జీబీ చేసింది. జియో తన రూ.309 పోస్టు పెయిడ్ప్లాన్పై 30జీబీ డేటాను, ఎయిర్టెల్ తన రూ.399 మైఇన్ఫినిటీ పోస్టుపెయిడ్ ప్లాన్పై 20జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications