ఉచిత Wi-Fi ప్రాజెక్ట్ తరువాత గూగుల్ ఏం చేయబోతోంది ?
సెప్టెంబర్ 2015 లో, Google CEO సుందర్ పిచై భారతదేశం అంతటా 400 రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi ఇవ్వాలనే లక్ష్యంగా ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు.
సెప్టెంబర్ 2015 లో, Google CEO సుందర్ పిచై భారతదేశం అంతటా 400 రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi ఇవ్వాలనే లక్ష్యంగా ప్రాజెక్ట్ ప్రకటించారు అయితే ఈ సంవత్సరం జూన్ నెలలో ప్రాజెక్టును పూర్తి చేసింది. అస్సాం యొక్క డిబ్రూగఢ్ రైల్వే స్టేషన్తో 400 రైల్వే స్టేషన్లలో ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు గూగుల్ ప్రకటించింది. అయితే గూగుల్ మరో సరికొత్త ప్రాజెక్ట్ కు ప్లాన్ చేస్తుంది. రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై ఇచ్చిన విధంగా మాల్స్ మరియు విశ్వవిద్యాలయలో,పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై అందించడానికి ప్లాన్ చేస్తుంది.

ఇండోనేషియా మరియు మెక్సికో లో కూడా :
ఇండియాలోని రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi ఇచ్చిన విధంగా ఇండోనేషియా మరియు మెక్సికో లో కూడా ఉచిత Wi-Fi ఇవ్వాలని కొత్త ప్రాజెక్ట్ను మొదలు బెట్టింది గూగుల్ . ఇండియాలోని ప్రజలు ఫ్రీ నెట్ కోసం ఎలా తహ తహ లాడుతున్నారో గమనించి ఇతర దేశాలలో కూడా ఇదే విధంగా ఉంటుంది అని తెలుసుకొని ఉచిత Wi-Fi ను ఇవ్వాలని అనుకుంటుంది.రిజిస్టర్ అయిన రిపోర్ట్ ప్రకారం ఉచిత వైఫై ఇచ్చిన స్టేషన్స్ లో సెషన్కు 300MB యొక్క సగటు వినియోగం (సుమారు 30 నిమిషాలు) నమోదు చేసింది అంటే రోజుకు 560MB డేటాను రిలయన్స్ జీయో యొక్క సగటు వినియోగంతో పోలిస్తే, గూగుల్ ఫ్రీ వైఫై డేటా వినియోగం ఎక్కువ కలిగి ఉంది.

తదుపరి బిలియన్ కూడా ఇంటర్నెట్ కనెక్షన్:
తదుపరి బిలియన్ కు ఇంటర్నెట్ కనెక్టివిటీని తీసుకురావడానికి మార్గం సుగమం చేయగలదని గూగుల్ విశ్వసిస్తుంది. Google దాని సాంకేతికతను ఇప్పటికే రైల్టెల్ ఫైబర్ నెట్ వర్క్ లో విస్తరించింది, ఇది ఇప్పటికే దేశంలో భారీగా కవరేజ్ ఉంది. ఫేస్బుక్ కూడా ఇలాంటి ప్రయోగాలు చేసింది.

ఇండియాలోని పబ్లిక్ రద్దీ ఉన్న చోట్ల కూడా ఫ్రీ Wi-Fi:
ఇప్పటికే ఇంటర్నెట్ కంపెనీలు భారతీయ టెలికాం కంపెనీలతో జతకట్టి మరిన్ని ప్రదేశాలలో ఫ్రీ Wi-Fi ని ప్రారంభించబోతున్నారని గూగుల్ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ సూర్యనారాయణ కొడుకుల్లా ప్రకటించారు.

Wi-Fi వ్యవస్థ కోసం:
Wi-Fi వ్యవస్థ కోసం అవసరమైన నియంత్రణ విధానాల కొరత Google కు ఉంది .స్పెక్ట్రం, లైసెన్సింగ్, మౌలిక సదుపాయాలను పంచుకోవడం, చెల్లింపు, ధృవీకరణతో సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వనికి కోరుకుంటుంది.

పబ్లిక్ వైఫై 2019 నాటికి:
పబ్లిక్ వైఫై 2019 నాటికి 40 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను కనెక్ట్ చేయబోతుంది.


Click it and Unblock the Notifications








