షెర్వానీల్లో సిలికాన్ వ్యాలీ దిగ్గజాలు : టెక్ పవర్ చూపించిన అనంత అంబానీ వివాహ వేడుక..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం బ్లాక్బస్టర్ సినిమాను తలపించింది. బాలీవుడ్ ప్రముఖులు, ఇతర ముఖ్యులు, ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో చోటు సంపాదించుకుంది. అయితే ఈ పెళ్లిలో మరో ప్రత్యేకమైన అంశం ఒకటి. టెక్నాలజీ రంగంలో ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
నటులు కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు కాదు.. డిజిటల్ ప్రపంచంలో దిగ్గజాలు అయిన సీఈవోలు, బిలియనీర్లు ఈ భారతీయ సంప్రదాయాలతో వేడుకగా జరిగిన పెళ్లి కోసం ఖండాలు దాటి వచ్చారు. ఈ దిగ్గజ వ్యక్తులు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి వేడుకలకు హాజరవుతుంటారు.

సంగీత్ వేడుకలో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, ప్రిస్సిల్లా చాన్ భారతీయ వస్త్రాధరణతో ఫోటోలకు పోజిలిచ్చారు. మరో ప్రముఖ వ్యక్తి బిల్ గేట్స్ భారత పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతూ కనిపించారు. సందర్ పిచాయ్ కూడా ఈ వేడుకల్లో కనిపించారు. వీరితోపాటు సాఫ్ట్బ్యాక్కు చెందిన మసయోషి సోన్, బ్లాక్ రాక్కు చెందిన ల్యారీ ఫింక్, అడోబ్ సీఈవో శాంతన నారాయణ్ వంటి దిగ్గజాలు హాజరయ్యారు. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా డావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులోని కనిపిస్తుంటారు.
ఇది కేవలం అతిథుల జాబితా మాత్రమే కాదు. బోర్డ్రూం రీయూనియన్ను తలపించింది. అంబానీ ఇంట పెళ్లి వేడుక వీరందరినీ ఇలా కలిపింది.
ఈ దిగ్గజాల కలయిక ఏం సూచిస్తుంది?
ఇందులో కొంత వ్యక్తిగత బంధం ఉంది. అంబానీలు టెక్ సహా ఇతర పారిశ్రామిక వేత్తలతో సుదీర్ఘమైన సంబంధాలను కొనసాగిస్తున్నారు. దీంతోపాటు భారత్ టెక్ విస్తరణకు కీలక కేంద్రంగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా భారత్ టెక్ రంగానికి టాలెంట్ ఇంజిన్గా ఉంది. కేవలం వివాహం వేడుకగా మాత్రమే కాకుండా.. ఒక సంకేతంగా నిలిచింది.

టెక్ దిగ్గజాలు ప్రపంచంతో ఎలాంటి సంబంధాలను కలిగి ఉన్నారో ఈ వేడుక ద్వారా వెల్లడయింది. మెటా సీఈవో జుకర్బర్గ్ తమ కుటుంబ సభ్యులతో కలిగి సంగీత్లో కనిపించారు. బిల్ గేట్స్.. నటులు మరియు ఇతర ప్రముఖులతో ముచ్చటించుతూ కనిపించారు. 2024 సంవత్సరం కేవలం ఐపీఈవోలు, టెక్ సదస్సులకు సంబంధించిన కీనోట్లతోనే గుర్తించబడలేదు. ఈ సంవత్సరంలో జరిగిన అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా అంబానీ ఇంట పెళ్లి నిలిచింది.
ఉన్నత స్ధాయి వ్యక్తులు హాజరయినా.. ఎలాంటి కాన్ఫరెన్స్లు, లైవ్ ఈవెంట్స్ లేవు. టెక్ దిగ్గజాలు, బాలీవుడ్ స్టార్స్, క్రికెట్ స్టార్స్, మధ్యప్రాచ్యం నుంచి వచ్చిన ప్రముఖులున్నారు. ఇది సహజమైన ఈవెంట్గానే నిలిచింది. దీని శక్తిని మరింత పెంచింది.

ఇలాంటి పెళ్లి వేడుకల్లో టెక్ మరియు సంప్రదాయం, పవర్ మరియు పాప్ సంస్కృతి మధ్య సరిహద్దులను మసకబారినట్లు అనిపిస్తాయి. అయితే ఈ వివాహ వేడుక ప్రతీకాత్మకంగా అనిపించింది. దీని ఆధారంగా భారత్ కేవలం ఆతిథ్యం ఇచ్చే దేశం మాత్రమే కాదు. గ్లోబల్ చర్చల కేంద్రంగా నిలిచింది.
అయితే ఈ తరహా దిగ్గజాల కలయిక చాలా అరుదుగా జరుగుతుంది. సుందర్ పిచాయ్, మార్క్ జుకర్బర్గ్ ఎక్కుగా ప్రపంచ ఆర్థిక వేదిక వంటి సదస్సులో ఎక్కువగా కనిపిస్తుంటారు. అదే బిల్ గేట్స్ను ఎక్కువగా గ్లోబల్ హెల్త్ సమ్మిట్స్లో చూస్తుంటాం. కానీ ఓ వివాహ వేడుకలో.. అది కూడా భారత్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం మాత్రమే కాదు. టర్నింగ్ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి.
అయితే ఏదైనా గానీ సంగీత్లో ఎవరు ప్రదర్శనలు ఇచ్చారు. అనేది ఇక్కడ విషయం కాదు. రెండో వరసలో ఎవరు కూర్చున్నారు అనేదే ముఖ్యం. ఎందుకంటే సిలికాన్ వ్యాలిలో బిజిగా గడిపే వ్యక్తులు షెర్వానీలతో కనిపించినప్పుడు ప్రపంచ కచ్చితంగా ఈ వేడుకపై దృష్టిపెడుతుంది.


Click it and Unblock the Notifications








