Just In
- 11 min ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Movies
Michael day 1 collections మైఖేల్కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఇండియాను మింగేస్తున్న చైనా, మరి ఇంతలా దిగజారి..?
భారత్ను డ్రాగన్ దేశం మింగేస్తోంది. ఇండియా ఆర్థిక వ్యవస్థతో పాటు మార్కెట్ ను చైనా కబళిస్తోంది. ప్రతి ఇంటా ఆ దేశ వస్తువులను డంప్ చేస్తోంది. ఇంకా షాకింగ్ వార్త ఏంటంటే ఆ దేశ వాణిజ్య లావాదేవీలు ప్రస్తుతం 71.5 బిలియన్ డాలర్లకు చేరడం. ఇది భారత వ్యాపారవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఇంతలా వ్యాపారం ఎందుకు పుంజుకుంటోంది. స్మార్ట్ లుక్కేద్దాం.

బుసలు కొడుతున్న డ్రాగన్
ఓ వైపు సరిహద్దులో సరిగమలు, మరో వైపు భారత వ్యాపార ఆక్రమణ. ఇది బుసలు కొడుతున్న డ్రాగన్ కంట్రీ తీరు. ప్రతి భారతీయుడి ఇంట్లో కారు చౌకౌన వస్తువులను ఈ కంత్రీ దేశం డంప్ చేస్తోంది.

భారత ఆర్థిక వ్యవస్థ కుదేల్
దీని ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో హోల్ సేల్ వ్యాపారులు ప్రతి వస్తువు దిగుమతి కోసం చైనాపై ఆధారపడుతున్నారు.

చైనా వస్తువులపైనే..
చైనా నుంచి చౌకగా అన్ని రకాల వస్తువుల దిగుమతితో పరిశ్రమల మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇది భారత్ లో చైనా సృష్టించిన కల్లోలం. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి మెషినరీ పార్ట్స్, మొబైల్స్, సోలార్ ప్యానల్స్ వరకు ఇప్పుడు చైనా వస్తువులపైనే ఆధారపడుతున్నారు.

షాక్ కొడుతున్న చైనా దిగుమతులు
ఫలితంగా 2010-11లో 43.5 బిలియన్ డాలర్లు ఉన్న చైనా దిగుమతులు 2016-17 నాటికి 61.3 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో చైనాకు ఎగుమతులు సుమారు 18.1-14.2 నుంచి ప్రస్తుతం 10.2కు పడిపోయాయి.

మొత్తంగా 71.5 బిలియన్ డాలర్ల మేర వ్యాపార లావాదేవీలు
చైనా మొత్తంగా 71.5 బిలియన్ డాలర్ల మేర భారత్ తో వ్యాపార లావాదేవీలు ( అంచనా ) జరుపుతోంది. ఇందులో ప్రధానంగా ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య లోటు 2011-12లో -37.2 బిలియన్ డాలర్లు ఉండగా, గత ఆరేళ్లలో అది -51.1 బిలియన్ డాలర్లకు చేరింది.

భారత టెలికామ్ రంగంపై
ప్రధానంగా భారత టెలికామ్ రంగంపై చైనా దృష్టి పెట్టింది. భారత్ లోని 8 బిలియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 51శాతం చైనా నియంత్రణలో ఉంది.

రూ.70 వేల కోట్ల టెలికా రంగ దిగుమతులు
ఏడాదికి సుమారు రూ.70 వేల కోట్ల టెలికా రంగ దిగుమతులు చైనా నుంచి జరుగుతున్నాయి. భారత్ తో పాటు ప్రపంచ మార్కెట్ ను సొంతం చేసుకునేందుకు గత కొన్నేళ్లుగా చైనా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది.

చైనా గత కొన్నేళ్లుగా
సొంత మల్టీ నేషనల్ కంపెనీలను సృష్టించి, అభివృద్ధి చేసి వాటిని రక్షించేందుకు చైనా గత కొన్నేళ్లుగా విధానపరమైన చర్యలు చేపట్టింది. అమెరికా కంపెనీలకు ధీటుగా సొంత సంస్థలను చైనా డెవలప్ చేసింది.

అమెజాన్ కు పోటీగా అలీబాబా
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కు పోటీగా అలీబాబా, గూగుల్ మాదిరిగా చైనా సొంత సెర్చ్ ఇంజిన్ బైదు, పాపులర్ సోషల్ మీడియా ఫేస్బుక్ కు దీటుగా ఉయ్ చాట్, ఆపిల్ ఫోన్లకు పోటీగా షియోమి మొబైల్స్ ను రంగంలోకి దించింది.

సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు
చైనా నుంచి మన దేశానికి దిగుమతులు అయిన విలువ సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.. ఈ మొత్తం పై చైనా ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో సుమారు 80 వేల కోట్లు ఆదాయం వస్తుంది.

ఆయుధాల విలువకి సమానం
80 వేల కోట్లు అంటే, మనదేశ రక్షణ కోసం మనం ఖరీదుచేసే ఆయుధాల విలువకి సమానం. మరి దీనికి పుల్స్టాప్ పెట్టాలంటే చైనా వస్తువులను కొనడం బ్యాన్ చేయాలి. అది జరగుతుందా అన్నదే మనముందున్న ప్రశ్న.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470