అక్టోబర్లో ఆ కీలక ప్రకటన!

సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ను ఈ అక్టోబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్టుంది. ఈ అంశాన్ని టొరంటోలో జరిగిన మైక్రోసాఫ్ట్ వరల్డ్వైడ్ పార్టనర్ కాన్ఫరెన్స్లో సంస్థ యాజమాన్యం వెల్లడించింది విండోస్ 7 విడుదలైన మూడు సంవత్సరాల తరువాత విండోస్8 విడుదల కానుండటంతో మార్కెట్ వర్గాలు ఈ వోఎస్ పై భారీ అంచనాలు నెలకున్నాయి.
విండోస్ 8 ప్రపంచవ్యాప్తంగా 231 మార్కెట్లలో 109 భాషల్లో లభ్యమవుతుందని మైక్రోసాఫ్ట్ సీఈవో స్టీవ్ బామర్ ఈ సందర్భంగా తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టబోతున్న సర్ ఫేస్ ట్యాబ్లెట్ పీసీలలో సైతం విండోస్8ను వినియోగించనున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసులు, డెస్క్టాప్, ల్యాప్టాప్లన్నింటినీ ఈ వోఎస్ సపోర్ట్ చేస్తుంది.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








